UP Assembly Election 2022 Voting: ప్రశాంతంగా ముగిసిన మూడు రాష్ట్రాల పోలింగ్

| Edited By: Balaraju Goud

Feb 14, 2022 | 6:21 PM

ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో మరో కీలక ఘట్టం ముగిసింది. ఇవాళ ఉత్తరప్రదేశ్‌‌ అసెంబ్లీకి రండో దశ పోలింగ్‌తో పాటు ఉత్తరాఖండ్‌, గోవా రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది.

UP Assembly Election 2022 Voting: ప్రశాంతంగా ముగిసిన మూడు రాష్ట్రాల పోలింగ్
Assembly Election 2022 Voti

UP Vidhan Sabha Election 2022 Phase 2 Voting and Poll Percentage updates: ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి.  ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, గోవా రాష్ట్రాలలో ఓటింగ్‌ ప్రక్రియ సజావుగా సాగుతోంది. ఉత్తరప్రదేశ్‌ (UP) లో ఇది రెండో దశ పోలింగ్‌ కాగా, ఉత్తరాఖండ్‌, గోవా రాష్ట్రాల్లో ఒకేదశలో పోలింగ్‌ పూర్తి కానుంది. రెండో విడతలో ఉత్తర ప్రదేశ్‌లో 55, ఉత్తరాఖండ్‌ (Uttarakhand) లో 70, గోవా (Goa) లో 40 స్థానాలకు కట్టుదిట్టమైన బందోబస్తు మధ్య పోలింగ్ కొనసగుతుంది. ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఉదయం 7గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం 6గంటల వరకు కొనసాగనుంది.  ఈరోజు జరిగిన ఓటింగ్‌లో మూడు రాష్ట్రాల్లోని మొత్తం 165 అసెంబ్లీ స్థానాల్లో 1519 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈరోజు యూపీలో దాదాపు 2.2 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ముస్లింలు, దళితులు, రైతులు ఈ దఫా ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనున్నారు. పోటీ ప్రధానంగా బీజేపీ, ఎస్పీ మధ్యే కనిపిస్తోంది. ఉత్తరప్రదేశ్‌లో రెండో దశ ఓటింగ్‌కు సంబంధించిన ప్రతి అప్‌డేట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 14 Feb 2022 06:17 PM (IST)

    సాయంత్రం 5 గంటల వరకు 60.44 శాతం పోలింగ్

    ఉత్తరప్రదేశ్‌లో రెండో దశ ఎన్నికలు ముగిశాయి. సాయంత్రం 5 గంటల వరకు 60.44 శాతం పోలింగ్ నమోదైంది. అంతకుముందు మధ్యాహ్నం 3 గంటల వరకు 51.93 శాతం ఓటింగ్ జరగ్గా, మధ్యాహ్నం 1 గంటల వరకు 39.09 శాతం ఓటింగ్ జరిగింది. అదే సమయంలో, ఉదయం 9 గంటల వరకు 9.45% ఓటింగ్ నమోదు కాగా, 11 గంటలకు ఈ ఓటింగ్ 23.03%కి పెరిగింది.

  • 14 Feb 2022 06:15 PM (IST)

    దారి తప్పిన వారికి ఓట్ల దెబ్బతో కొట్టాలిః యోగి

    హత్రాస్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. మోడీ , బిజెపి వ్యాక్సిన్ మనల్ని కరోనా నుండి రక్షించిందని సీఎం యోగి అన్నారు. కరోనా వ్యాక్సిన్‌ను కూడా రాజకీయం చేసినవారిని, దారి తప్పిన వారికి ఓట్ల దెబ్బతో చెంపదెబ్బ కొట్టాలన్నారు.


  • 14 Feb 2022 06:10 PM (IST)

    మధ్యాహ్నం 3 గంటల వరకు ఎంత పోలింగ్ నమోదైందంటే..

  • 14 Feb 2022 06:09 PM (IST)

    సహరన్‌పూర్‌లో ప్రిసైడింగ్ అధికారి దుర్మరణం

    సహరాన్‌పూర్‌లో విధి నిర్వహణలో ఉన్న ప్రిసైడింగ్ అధికారి రషీద్ అలీ ఖాన్ గుండెపోటుతో మరణించారు. అతను సడక్ దుద్లీలోని ఒక పాఠశాలలో ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నారు. నకుడ్ అసెంబ్లీలోని సర్సావాలోని బూత్ నంబర్ 227లో విధులు నిర్వహిస్తున్నారు. కైలాష్‌పూర్ నివాసి అయిన రషీద్ అలీ ఖాన్ ఎన్నికల అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తుండగా ప్రాణాలు విడిచారు.

    Election Officer

  • 14 Feb 2022 06:05 PM (IST)

    మొరాదాబాద్ నగర్‌లో బోగస్ ఓట్లు..

    మొరాదాబాద్ నగర్‌లోని పలు పోలింగ్ బూతుల్లో దొంగ ఓట్లు నమోదవుతున్నాయని సమాజ్ వాదీ పార్టీ ఆరోపించింది. మొరాదాబాద్ నగర్ అసెంబ్లీ పరిధిలోని బూత్-28, బూత్-33, 36లో ఫేక్ ఓటింగ్ జరుగుతున్నట్లు పార్టీ ఆరోపించింది. జిల్లా యంత్రాంగం, ఎన్నికల సంఘం స్పందించాలని వారు డిమాండ్ చేశారు..

  • 14 Feb 2022 01:20 PM (IST)

    తల్లితో కలిసి ఓటు వేసిన అమిత్ పాలేకర్

    అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ సీఎం అభ్యర్థి అమిత్ పాలేకర్ తన తల్లితో కలిసి ఓటు వేశారు. మార్పు తీసుకురావాల్సిన తరుణం ఇదేనని అన్నారు.

  • 14 Feb 2022 01:19 PM (IST)

    ప్రధాని పర్యటన.. సీఎం చన్నీ హెలికాప్టర్‌కు అనుమతి లేదు

    చండీగఢ్ రాజేంద్ర పార్క్ నుంచి హోషియార్‌పూర్ వెళ్లేందుకు పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ హెలికాప్టర్‌కు అనుమతి ఇవ్వలేదు. సాక్షాత్తూ ప్రధాని నరేంద్రమోడీ వీవీఐపీ మూవ్ మెంట్ కారణంగా చన్నీళ్ల హెలికాప్టర్ ఆపాల్సి వచ్చింది. రాహుల్ గాంధీతో ఎన్నికల కార్యక్రమానికి హాజరయ్యేందుకు సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ హోషియార్‌పూర్ వెళ్లాల్సి ఉంది.

  • 14 Feb 2022 01:18 PM (IST)

    యూపీలో బీజేపీ అభ్యర్థిపై దాడి

    యూపీలోని సంభాల్ జిల్లాలో బీజేపీ అభ్యర్థి హరేంద్ర అలియాస్ రింకూ వాహనం ధ్వంసమైంది. అంతకుముందు ఆయన కారును ఓవర్‌టేక్ చేసి దాడి చేశారు. దుండగులు కర్రలతో ఆయుధాలతో ఉన్నాట్లుగా తెలుస్తోంది. పోలీసులు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం.

  • 14 Feb 2022 12:09 PM (IST)

    హిమాచల్ గవర్నర్ కూడా ఓటు వేశారు

    హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ గోవాలోని వాస్కోడగామా అసెంబ్లీ నియోజకవర్గంలోని పోలింగ్ బూత్ నంబర్ 7లో ఓటు వేశారు.

  • 14 Feb 2022 12:07 PM (IST)

    ఉత్పల్ పారికర్ గెలిస్తే మాట్లాడుతా- కాంగ్రెస్‌ నేత మైఖేల్‌

    గోవాలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. కాంగ్రెస్‌ నేత మైఖేల్‌ లోబో మాట్లాడుతూ.. ‘నేను జీవించి ఉన్నంత వరకు నా కొడుకు (ఉత్పల్‌ పారికర్‌)ని రాజకీయాల్లోకి తీసుకురానని మనోహర్‌ పారికర్‌ చెప్పారని అన్నారు. వస్తే అతను సొంతగా రావాలని పారికర్ అన్నట్లుగా గుర్తు చేశారు. అతను గెలిస్తే (ఉత్పల్ పారికర్) మేము అతనితో మాట్లాడుతాం.

  • 14 Feb 2022 12:03 PM (IST)

    100 ఏళ్ల లాల్ బహదూర్ సహస్పూర్ అసెంబ్లీలో ఓటు వేశారు

    100 ఏళ్ల శ్రీ లాల్ బహదూర్ సహస్పూర్ విధానసభ పరిధిలోని బూత్ నంబర్ 64లో తన ఓటు వేశారు. బలమైన ప్రజాస్వామ్యం కోసం అందరూ ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.

  • 14 Feb 2022 11:50 AM (IST)

    గోవాలో రికార్డ్ బ్రేకింగ్ ఓటింగ్ జరుగుతుంది: చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్

    గోవాలో ఎన్నికలు ప్రశాంతంగా, ఉత్సాహంగా జరుగుతున్నాయని ఎన్నికల అధికారి ట్వీట్ చేశారు. ఇప్పటివరకు 11.04% ఓటింగ్ నమోదైందని గోవా చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కునాల్ తెలిపారు. కొన్ని అసెంబ్లీలలో ఓటింగ్ 14%కి కూడా చేరింది. ఈసారి రికార్డు స్థాయిలో పోలింగ్‌ నమోదవుతుందని అంచనా వేస్తున్నారు.

  • 14 Feb 2022 11:48 AM (IST)

    ఉత్తర ప్రదేశ్‌లో ఉదయం 11 గంటల వరకు 23 శాతం ఓటింగ్‌

    ఉత్తర ప్రదేశ్‌లో ఉదయం 11 గంటల వరకు 23 శాతం ఓటింగ్‌ నమోదైంది.

  • 14 Feb 2022 11:00 AM (IST)

    ఉత్పల్ పారికర్ ఎన్నికల్లో ఓడిపోతారు: సీఎం ప్రమోద్ సావంత్

    కాంగ్రెస్ నేతలు మైఖేల్ లోబో, ఉత్పల్ పారికర్ ఇద్దరూ ఎన్నికల్లో గెలవరని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ అన్నారు. కచ్చితంగా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కానుందన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఎవరితోనూ మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు. పూర్తి మెజారిటీ ప్రభుత్వాన్ని సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

  • 14 Feb 2022 10:58 AM (IST)

    గోవాలో ఉదయం 9 గంటల వరకు 11.04% ఓటింగ్‌

    అసెంబ్లీ ఎన్నికల్లో ఉదయం 9 గంటల వరకు 11.04% ఓటింగ్‌తో గోవాలో ఓటింగ్ బాగా ప్రారంభమైంది.

  • 14 Feb 2022 10:57 AM (IST)

    ఓటు హక్కును వినియోగించుకున్న ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి

    మాజీ కేంద్ర విద్యా మంత్రి, ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ డెహ్రాడూన్‌లో ఓటు వేశారు.

  • 14 Feb 2022 10:55 AM (IST)

    ఉత్తరాఖండ్‌లో 5.15 శాతం ఓటింగ్‌

    ఉదయం 9 గంటల వరకు ఉత్తరాఖండ్‌లో 5.15 శాతం ఓటింగ్‌ నమోదైంది.

  • 14 Feb 2022 10:23 AM (IST)

    యూపీలో ఉదయం 9 గంటల వరకు 9.45% ఓటింగ్ నమోదు

    ఉత్తరప్రదేశ్‌లో రెండో దశ ఎన్నికల్లో ఉదయం 9 గంటల వరకు 9.45% ఓటింగ్ జరిగింది. అమ్రోహా, సంభాల్‌లలో అత్యధిక ఓటింగ్ ఉంది. బరేలీలో అత్యల్పంగా 8.36% ఓటింగ్ నమోదైంది.

  • 14 Feb 2022 09:57 AM (IST)

    ఓటు వేసిన బీజేపీ నేత జితిన్ ప్రసాద్..

    షాజహాన్‌పూర్‌లోని పోలింగ్ స్టేషన్‌కు చేరుకున్న తర్వాత బీజేపీ నేత జితిన్ ప్రసాద ఓటు వేశారు. రాష్ట్రంలో బీజేపీకి 300కు పైగా సీట్లు వస్తాయని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఈసారి షాజహాన్‌పూర్‌లోని 6 సీట్లలో బీజేపీకి 6 సీట్లు వస్తాయన్నారు.

  • 14 Feb 2022 08:49 AM (IST)

    క్యూలో నిలబడిన కేంద్ర మంత్రి నఖ్వీ..

    ఉత్తరప్రదేశ్‌లో రెండో దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ జరుగుతోంది. రాంపూర్‌లో కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ ఓటు వేసేందుకు క్యూలో నిలబడి కనిపించారు.

  • 14 Feb 2022 08:48 AM (IST)

    రెండో దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతం

    ఉత్తరప్రదేశ్‌లో రెండో దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. అమ్రోహాలో కూడా ఓటింగ్ జరుగుతోంది. ఈ ఫోటోల్లో పోలింగ్ బూత్ వద్ద పరిస్థితి చూడవచ్చు. ఇక్కడ ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకేనేందుకు ఉదయం నుంచే క్యూ లైన్లలో నిలబడి ఉన్నారు.

  • 14 Feb 2022 08:46 AM (IST)

    భారీ మెజారిటీతో మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తా: సీఎం యోగి

    ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ విజయంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్  ANIతో మాట్లాడారు. మొదటి దశ ఎన్నికల తర్వాత పరిస్థితి మరింత స్పష్టమవుతోందని.. బీజేపీకి భారీ మెజారిటీ ఉందని నేను నమ్మకంగా చెప్పగలను అంటూ వెల్లడించారు. ఉత్తరప్రదేశ్.. ప్రభుత్వం ఏర్పడుతుంది.. అందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు అంటూ ధీమా వ్యక్తం చేశారు.

  • 14 Feb 2022 08:44 AM (IST)

    తప్పక ఓటు వేయండి: సీఎం యోగి

    సిఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఒక ట్వీట్ ద్వారా ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ‘అల్లర్లు లేని, భయం లేని కొత్త ఉత్తరప్రదేశ్’ అభివృద్ధి యాత్రను కొనసాగించడానికి వారు తప్పక ఓటు వేయాలని కోరారు.

  • 14 Feb 2022 08:43 AM (IST)

    అందరి కంటే ముందే ఓటు హక్కు వినియోగించుకున్న ఆర్థిక మంత్రి సురేష్ ఖన్నా

    ఉత్తరప్రదేశ్‌లో రెండో దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఆలయాన్ని సందర్శించేందుకు రాష్ట్ర ఆర్థిక మంత్రి సురేష్ ఖన్నా షాజహాన్‌పూర్ చేరుకున్నారు. అనంతరం పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటు వేశారు. “ 300 కంటే ఎక్కువ సీట్లు గెలుస్తాము. షాజహాన్‌పూర్‌లో 6 సీట్లు గెలుస్తాం.

  • 14 Feb 2022 07:33 AM (IST)

    ఆజం ఖాన్‌కు బలమైన స్థానం..

    రెండవ దశలో, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ధరమ్ సింగ్ సైనీ, బిజెపిని విడిచిపెట్టి, ఎస్పిలో చేరారు. ఆజం ఖాన్ తన బలమైన స్థానం అయిన రాంపూర్ స్థానం నుండి పోటీ చేయగా, ధరమ్ సింగ్ సైనీ నకూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. స్వర్ స్థానం నుంచి ఖాన్ కుమారుడు అబ్దుల్లా ఆజం బరిలోకి దిగారు. ఫిబ్రవరి 10న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ జరిగింది. మార్చి 10న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

  • 14 Feb 2022 07:32 AM (IST)

    యూపీలో సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది

    ఉత్తరప్రదేశ్‌లో సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. రెండో దశలో జరగనున్న 55 స్థానాల్లో 2017లో బీజేపీ 38 సీట్లు గెలుచుకోగా, ఎస్పీ 15, కాంగ్రెస్‌ రెండు స్థానాల్లో విజయం సాధించాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ, కాంగ్రెస్ కూటమిగా పోటీ చేశాయి. ఎస్పీ గెలుచుకున్న 15 స్థానాల్లో ముస్లిం అభ్యర్థులు 10 స్థానాల్లో విజయం సాధించారు.

  • 14 Feb 2022 07:15 AM (IST)

    ముందుగా ఓటు వేయాలని ప్రధాని మోడీ విజ్ఞప్తి

    ఓటు వేయడానికి ముందు ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటు వేయాలని ట్వీట్‌ చేయడం ద్వారా విజ్ఞప్తి చేశారు. ఆయన తన ట్విట్టర్ వేదికగా.. ‘ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల రెండో రౌండ్‌తో, ఉత్తరాఖండ్, గోవాలోని అన్ని అసెంబ్లీ స్థానాలకు ఈరోజు ఓటింగ్ జరుగుతోంది. ఈ ప్రజాస్వామ్య పవిత్ర పండుగలో ఓటర్లందరూ పాల్గొని ఓటింగ్‌లో కొత్త రికార్డు సృష్టించాలని అభ్యర్థిస్తున్నాను. గుర్తుంచుకోండి- ముందుగా ఓటు వేయండి. ఈ తర్వాత ఏదైనా ఇతర పనులు.. అంటూ ప్రధాని మోడీ గుర్తు చేశారు.

  • 14 Feb 2022 07:13 AM (IST)

    ఓటింగ్‌కు సంబంధించి 60 వేల మందికి పైగా భద్రతా సిబ్బంది

    ఉత్తరప్రదేశ్‌లో రెండో విడత పోలింగ్‌కు భద్రతను కట్టుదిట్టం చేశారు. దాదాపు 60,000 మంది పోలీసులు, 800 కంపెనీల పారామిలటరీ బలగాలను మోహరించినట్లు అధికారులు తెలిపారు. 12538 పోలింగ్‌ కేంద్రాలకు గాను 4,917 పోలింగ్‌ కేంద్రాల్లో మరింత భద్రత ఉంటుంది.

  • 14 Feb 2022 07:12 AM (IST)

    55కి 20 సీట్లలో దళితుల ప్రభావం

    నేడు యూపీలోని 55 సీట్లలో 20 స్థానాల్లో దళిత ఓటర్ల ప్రభావం 20 శాతానికి పైగా ఉంది. ఈ జిల్లాలన్నింటిలో ఎస్పీ-ఆర్‌ఎల్‌డీ స్థానం చాలా పటిష్టంగా పరిగణించబడుతుంది. ఈ స్థానాల్లో రైతుల ఆందోళన కారణంగా చెరుకు రైతుల అసంతృప్తిని బీజేపీ ఎదుర్కోవాల్సి రావచ్చు. రెండో దశలో ఈరోజు 18 మిలియన్ల మంది పురుషులు, 0.94 మిలియన్ల మంది మహిళలు, 1269 మంది థర్డ్ జెండర్ ఓటర్లు తమ ఓటు వేయనున్నారు.

  • 14 Feb 2022 07:11 AM (IST)

    ఓటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి

    ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల రెండో విడతలో తొమ్మిది జిల్లాల్లోని 55 స్థానాలకు సోమవారం ఓటింగ్‌ జరగనుండగా, ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉత్తరప్రదేశ్ శాసనసభకు ఏడు దశల్లో ఎన్నికలను ప్రతిపాదించారు. రెండో దశలో రాష్ట్రంలోని 9 జిల్లాల్లో (సహారన్‌పూర్, బిజ్నోర్, మొరాదాబాద్, సంభాల్, రాంపూర్, అమ్రోహా, బుదౌన్, బరేలీ మరియు షాజహాన్‌పూర్) 55 అసెంబ్లీ స్థానాలకు ఈరోజు ఓటింగ్ జరగనుంది. కోవిడ్‌-19 ప్రోటోకాల్‌ ప్రకారం ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.

  • 14 Feb 2022 07:10 AM (IST)

    9 జిల్లాల్లోని 55 స్థానాల్లో ఇవాళ పోలింగ్

    పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్, సహరాన్‌పూర్, అమ్రోహా, సంభాల్, మొరాదాబాద్, రాంపూర్, బరేలీ, బదౌన్, షాజహాన్‌పూర్ 9 జిల్లాల్లో ఈరోజు పోలింగ్ జరగనుంది. ఈ జిల్లాలన్నింటిలో 55 స్థానాలకు గాను 25 సీట్లకు పైగా ముస్లిం ఓటర్లు నిర్ణయాత్మక పాత్రలో ఉన్నారు.

Follow us on