AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asaduddin Owaisi: సర్టిఫికేట్ పొందిన బిచ్చగాడు అఖిలేష్ యాదవ్‌.. సంచలన వ్యాఖ్యలు చేసిన అసదుద్దీన్ ఒవైసీ

ఆలిండియా మజ్లిస్ ఏ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సమాజ్ వాదీ పార్టీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Asaduddin Owaisi: సర్టిఫికేట్ పొందిన బిచ్చగాడు అఖిలేష్ యాదవ్‌.. సంచలన వ్యాఖ్యలు చేసిన అసదుద్దీన్ ఒవైసీ
Asaduddin Owaisi
Balaraju Goud
|

Updated on: Jan 06, 2022 | 3:12 PM

Share

Asaduddin Owaisi on Akilesh Yadav: ఆలిండియా మజ్లిస్ ఏ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సమాజ్ వాదీ పార్టీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సంభాల్‌లోని అస్మోలీ అసెంబ్లీలో ఏఐఎంఐఎం షోషిత్ వంచిత్ సమాజ్ సదస్సులో ఒవైసీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజ్‌వాదీ పార్టీ నేతలను ‘బ్రోకర్లు, సర్టిఫైడ్ బిచ్చగాళ్లు’గా అభివర్ణించారు. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌పై అసదుద్దీన్‌ ఒవైసీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మీరు ముఖ్యమంత్రి అయ్యారంటే ముస్లింల ధార్మిక ఓటుతోనేనని అన్నారు. గతంలో అఖిలేష్ యాదవ్ ఏఐఎంఐఎంతో పొత్తు పెట్టుకోవడానికి నిరాకరించారు. అదే సమయంలో కూటమిలో కూడా భాగస్వామిగా చేర్చుకోవడంలేదని అఖిలేష్ యాదవ్ స్పష్టం చేశారు. అఖిలేష్ యాదవ్ ఈ ప్రకటనపై ఒవైసీ మండిపడ్డారు. ర్యాలీలో ఆయన మాట్లాడుతూ, “కాంగ్రెస్, బీజేపీతో తప్ప ఎవరితోనైనా పొత్తుకు సిద్ధంగా ఉన్నానని అసదుద్దీన్ తెలిపారు.

ఇదిలావుంటే, అసదుద్దీన్ ఒవైసీకి జైలుకు వెళ్లాలంటే భయం పట్టుకుందని కాంగ్రెస్ నేత అజయ్ కుమార్ లల్లూ అన్నారు. CAA నిరసనలో మరణించిన వారి ఇళ్లకు ఆయన వెళ్లలేదు, ప్రియాంక గాంధీ మరణించిన వారి ఇళ్లకు వెళ్లి వారితో న్యాయం కోసం నిలబడారు. కాంగ్రెస్ నాయకులు వారికి అండగా నిలిచారు, నేను CAA, NRC సమయంలో జైలులో ఉన్నాను. కాంగ్రెస్ మైనారిటీ సెల్ చైర్మన్ కూడా జైలులో ఉన్నారు. ఒవైసీకి ఎలాంటి విభేదాలు లేవన్నారు. రైతులు, యువత గురించి మాట్లాడని వారు కర్ర దెబ్బలు తినడానికి భయపడుతున్నారు.

అఖిలేష్ యాదవ్ కలలుగన్న కృష్ణుడిపై అజయ్ కుమార్ లల్లూ మాట్లాడుతూ.. అఖిలేష్ యాదవ్‌కు దేవుడు బుద్ధి చెప్పాలని అన్నారు. ఇప్పుడు ఇంతమంది పని గురించి మాట్లాడరని అన్నారు. టాపిక్స్, ఇష్యూస్ చర్చకు వెళ్లడం లేదు. కాబట్టి ఇప్పుడు ఈ రెండూ కలలో దేవుడే వస్తున్నాడు. దేవుడే వీరికి కర్త. ఈసారి ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ మార్పు తీసుకురాబోతోందని, 2022లో ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని అజయ్ కుమార్ లల్లూ అన్నారు.

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ కుమార్ లల్లూ అభ్యంతరకర స్టేట్‌మెంట్ ఇస్తూ, యోగి చాలా తెలివైన వ్యక్తి, మీ నోటితో ఎంత మాట్లాడితే అంత మాట్లాడండి అని అన్నారు. విచారణ జరిగితే మూడు రోజులు జైలుకు వెళ్లి ఇంట్లోనే ఏడ్చేవాడి హృదయం ఎంత పెద్దదో తెలుసా. యోగి దళితులు, వెనుకబడిన వారిపై మాత్రమే బుల్డోజర్ చేయగలరు. వారికి ధైర్యం లేకుంటే అజయ్ మిశ్రా ఇంటి వద్ద బుల్ డోజర్ నడిపి చూపించండి. అంటూ సెటైర్లు వేశారు.

Read Also….  గుడ్‌న్యూస్.. QR కోడ్‌ని స్కాన్ చేసి డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు తెలుసా.. పూర్తి వివరాలు ఇవే..