Telangana: తెలంగాణలో ఎన్నికలు.. పక్కరాష్ట్రాల్లో కాయ్ రాజా కాయ్.. కోట్లు కుమ్మరిస్తున్న బెట్టింగ్‌ రాయుళ్లు..

| Edited By: Jyothi Gadda

Nov 15, 2023 | 8:46 AM

Hyderabad: పోలింగ్ సమయం సమీపిస్తున్న వేళ బెట్టింగ్ రాయుళ్ల జోష్ మొదలయ్యింది. తెలంగాణలో అధికారంలోకి ఎవరు వస్తారు..? అనే దానిపై ఏపీ లో కూడా విపరీతంగా బెట్టింగ్స్ పెడుతున్నారు.. కర్ణాటక ఫలితాల తరువాత కాంగ్రెస్ లో జోష్ రావడంతో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని పెద్ద ఎత్తున పందెం కాస్తున్నారు బెట్టింగ్ రాయుళ్లు.. కేవలం హైదరాబాద్ లోనే కాకుండా ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో తెలంగాణ ఎన్నికల ఫలితాలపై హోరాహోరీ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు.. ఈ బెట్టింగ్ బిజినెస్‌ సుమారుగా

Telangana: తెలంగాణలో ఎన్నికలు.. పక్కరాష్ట్రాల్లో కాయ్ రాజా కాయ్.. కోట్లు కుమ్మరిస్తున్న బెట్టింగ్‌ రాయుళ్లు..
Betting
Follow us on

తెలంగాణలో పోలింగ్‌ సర్వత్రా ఉత్కంఠగా మారింది. దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో బెట్టింగ్‌ కూడా జోరుగా జరుగుతోంది. తెలంగాణలో ఎన్నికల వేళ ఏపీలో బెట్టింగ్ జోరు మొదలయ్యింది.. ఎవరు అధికారంలోకి వస్తారు…తరువాత స్థానాలలో ఎవరు ఉంటారు.. అనే దాని పై కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయనే సమాచారం అందుతోంది…పోలింగ్ దగ్గర పడుతున్న వేళ అధికార పార్టీ BRS, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ప్రచార జోరును మరింత వేగవంతం చేయగా.. బెట్టింగ్ రాయుళ్లు కూడా అదే తరహా హుషారుతో బెట్టింగులకు పాల్పడుతున్నారు….ఇదిలా ఉంటే ఎన్నికల కోడ్ అమలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి దాకా సుమారుగా రూ.500 కోట్లకు పైగా నగదును సీజ్ చేశారు అధికారులు…అయితే పోలింగ్ సమయం దగ్గర పడడంతో తెలంగాణ ఎన్నికలపైనే అందరి ఫోకస్ నెలకొంది.

పోలింగ్ సమయం సమీపిస్తున్న వేళ బెట్టింగ్ రాయుళ్ల జోష్ మొదలయ్యింది. తెలంగాణలో అధికారంలోకి ఎవరు వస్తారు..? అనే దానిపై ఏపీ లో కూడా విపరీతంగా బెట్టింగ్స్ పెడుతున్నారు.. కర్ణాటక ఫలితాల తరువాత కాంగ్రెస్ లో జోష్ రావడంతో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని పెద్ద ఎత్తున పందెం కాస్తున్నారు బెట్టింగ్ రాయుళ్లు.. కేవలం హైదరాబాద్ లోనే కాకుండా ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో తెలంగాణ ఎన్నికల ఫలితాలపై హోరాహోరీ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు.. ఈ బెట్టింగ్ బిజినెస్‌ సుమారుగా రూ. 2 నుండి 3 వేల కోట్ల రూపాయల వరకు చేతులు మారే అవకాశం ఉందని సమాచారం.. బెట్టింగ్‌లలో  తెలంగాణ నెక్స్ట్ సీఎం ఎవరు..? తరువాత స్థానాల్లో ఎవరు ఉంటారు..? నియోజకవర్గ స్థాయిలో ఎవరు గెలుస్తారు..? మెజార్టీ ఓట్లు ఎవరికి వస్తాయి.. అని వివిధ రకాలుగా బెట్టింగులు పెడుతున్నారు నిర్వాహకులు… ఇప్పటికే కొన్ని కోట్ల రూపాయలను సీజ్ ను చేసిన అధికారులు.. ప్రస్తుతం బెట్టింగ్ రాయుళ్ల పై కూడా ఫోకస్ పెట్టారు…

అధికారం లోకి BRS వస్తుంది.. అని విపరీతంగా బెట్టింగ్స్ కొంత మంది పెట్టగా… మరి కొంత మంది కాంగ్రెస్ వస్తుంది అని బెట్టింగ్స్ కాస్తున్నారు…ఇక హైదరాబాద్ లోని ఎక్కువ ఓట్లు ఉన్న శేరిలింగంపల్లి నియోజకవర్గం పై కూడా బెట్టింగ్ రాయుళ్లు పందాలు పెడుతున్నారు…అరికపూడి గాంధీ ఒడిపోతారు.. అని ఎక్కువ స్థాయి లో డబ్బులు పెడుతున్నట్టుగా సమాచారం.. ఇక అనుకూలంగా ఉన్న వ్యక్తులు గెలుస్తారంటూ ఎవరికివారు పందాలకు దిగుతున్నారు. ఈ విధంగా న్నాయకుల పై కాసుల వర్షం కురిపిస్తున్నారు…మరోవైపు, గ్రేటర్ హైదరాబాద్ లో కీలకంగా ఉన్న నియోజకవర్గాలు శేరిలింగంపల్లి, మహేశ్వరం, కుత్బుల్లాపూర్, lb నగర్, ఉప్పల్ నియోజకవర్గాలపై ఎక్కువ బెట్టింగ్ లు నిర్వహిస్తున్నట్లు సమాచారం.. ఇక జిల్లాల వారిగా కొడంగల్, దుబ్బాక, కామారెడ్డి…ప్రాంతాలపై మరింత బెట్టింగ్ పెట్టేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు పందెం రాయుళ్లు…దీంతో తెలంగాణ పోలింగ్ సమయం దగ్గర పడడంతో కేవలం రాష్ట్రంలో కాకుండా పక్క రాష్ట్రాల్లోనూ బెట్టింగుల జోరు ఊపందుకుంటోంది. దీంతో పోలీసులు మరింత కట్టుదిట్టంగా వ్యవహరిస్తున్నారు. బెట్టింగ్‌లకు పాల్పడే వారిపై మరింత ఫోకస్‌ పెట్టారు.. బెట్టింగ్స్ కు పాల్పడే వారిపై నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..