Tamil Nadu Assembly Elections : కేంద్రహోం మంత్రి అమిత్ షా పై డీఎంకే నేత ఉదయనిధి తీవ్ర వ్యాఖ్యలు.. బహిరంగ సవాళ్లు

|

Apr 02, 2021 | 9:29 PM

Tamil Nadu Assembly Elections : కేంద్ర హోం మంత్రి, బీజేపీ కీలకనేత అమిత్ షా ఫై డీఎంకే పార్టీ నేత ఉదయనిధి స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. "మా కుటుంబ సభ్యుల ఇళ్లపై ఐటీ దాడులు చేయడం..

Tamil Nadu Assembly Elections : కేంద్రహోం మంత్రి అమిత్ షా పై డీఎంకే నేత ఉదయనిధి తీవ్ర వ్యాఖ్యలు.. బహిరంగ సవాళ్లు
Uday Nidhi Stalin
Follow us on

Tamil Nadu Assembly Elections : కేంద్ర హోం మంత్రి, బీజేపీ కీలకనేత అమిత్ షా పై డీఎంకే పార్టీ నేత ఉదయనిధి స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. “మా కుటుంబ సభ్యుల ఇళ్లపై ఐటీ దాడులు చేయడం మీ పిరికితనానికి నిదర్శనం. నా ఇంటి అడ్రెస్స్ ఇస్తున్నా, కేంద్ర మంత్రి అమిత్ షాకి నా ఇళ్లపై ఐటీ దాడులు చేయించే దమ్ముందా..?” అని ఉదయనిధి ఛాలెంజ్ విసిరారు. అంతేకాదు, “నా పేరు మీద ఉన్న ఆస్థి మొత్తం నీ కొడుకు పేరు మీద రాస్తాను… మీరు, మీ కొడుకు ఆస్థి నా పేరు మీద రాయగలరా ? అని సవాల్ చేశారు ఉదయనిధి. అంతటితో ఆగని ఉదయనిధి ” కేంద్ర మంత్రి అమిత్ షా.. మీరు నా సవాల్ స్వీకరించగలరా … నా చెల్లెలి ఇంట్లో ఐటీ దాడులతో మమ్మల్ని బయపెట్టలేరు. దివంగత నేత కరుణానిధి కుటుంబ సభ్యులు మీ బెదిరింపులకు భయపడరు. మేము అన్నాడీఎంకే పార్టీ నేతల లాగా మీ కాళ్ళు పట్టుకోము.” అంటూ ఉదయనిధి, అమిత్ షాపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

Read also : Hyderabad : రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాల భవిష్యత్ అవసరాలపై సీఎం కేసీఆర్‌ పగడ్భందీ యాక్షన్‌ ప్లాన్‌