PM Modi in Kerala : అయ్యప్ప భక్తులకు లాఠీ దెబ్బలు కాదు, పుష్పాలను కానుకగా ఇవ్వండి, స్కాంలకు కేరళ అడ్డాగా మారిందన్న మోదీ

|

Apr 02, 2021 | 10:32 PM

Kerala Assembly Election 2021 : అయ్యప్ప భక్తులకు పుష్పాలను కానుకగా ఇవ్వండి.. లాఠీదెబ్బలు కాదు అంటూ కేరళలో ప్రచారాన్ని రక్తికట్టించారు ప్రధాని మోదీ. ఎల్‌డీఎఫ్‌, యూడీఎఫ్‌ కూటమిపై విరుచుకుపడ్డారు...

PM Modi in Kerala : అయ్యప్ప భక్తులకు లాఠీ దెబ్బలు కాదు, పుష్పాలను కానుకగా ఇవ్వండి, స్కాంలకు కేరళ అడ్డాగా మారిందన్న మోదీ
Pm Narendra Modi In Madurai Election Campaign
Follow us on

Kerala Assembly Election 2021 : అయ్యప్ప భక్తులకు పుష్పాలను కానుకగా ఇవ్వండి.. లాఠీదెబ్బలు కాదు అంటూ కేరళలో ప్రచారాన్ని రక్తికట్టించారు ప్రధాని మోదీ. ఎల్‌డీఎఫ్‌, యూడీఎఫ్‌ కూటమిపై విరుచుకుపడ్డారు. రకరకాల స్కాంలకు కేరళ అడ్డాగా మారిందని మోదీ విమర్శించారు. కేరళలో నిజమైన అభివృద్ది జరగాలంటే బీజేపీని గెలిపించాలని పిలుపునిచ్చారు. ఎల్‌డీఎఫ్‌,యూడీఎఫ్‌ కూటములు ప్రజలతో సంబంధాలను కోల్పోయాయని మోదీ చెప్పుకొచ్చారు. పతనం తిట్టలో జరిగిన సభకు హాజరయ్యారైన మోదీ విపక్షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. స్వామియే శరణం అయ్యప్ప అని మోదీ అనడం అందరిని ఆకర్షించింది. కేరళలో ఎల్‌డీఎఫ్‌ ప్రభుత్వం ఓటుబ్యాంక్‌ రాజకీయాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిందన్నారు మోదీ. సోలార్‌ స్కాం, గోల్డ్‌ స్కాం, ల్యాండ్‌ స్కాం ఇలా కేరళలో అనేక స్కాంలు జరిగాయన్నారాయన. అయ్యప్ప భక్తులను కేరళ ప్రభుత్వం అనవసరంగా వేధింపులకు గురి చేస్తోందని మోదీ విమర్శించారు.

Read also : Road accident : ఓవర్ టర్న్ చేయబోయి పక్కన వెళ్తోన్న కారుపై పడ్డ మార్బుల్స్ లోడు లారీ, కారులో ఉన్న నలుగురూ స్పాట్ డెడ్