బంధువే రాబంధువై…8ఏళ్ల చిన్నారిపై అత్యాచారం..బాలిక మృతి
ప్రభుత్వాలు ఎన్ని కఠిన శిక్షలు అమలు చేస్తున్నప్పటికీ, ఎన్ని చట్టాలు అమల్లోకి వస్తున్నప్పటికీ ఆడపిల్లలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. తాజాగా ఎనిమిదేళ్ల బాలికను దారుణంగా రేప్ చేసిన ఘటన వెలుగు చూసింది. చికిత్స పొందుతూ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది..
కామాంధులు రెచ్చిపోతున్నారు. ఆడపిల్ల కనబడితే చాలు కళ్లు మూసుకుపోయి ప్రవర్తిస్తున్నారు. పసిపిల్లల నుంచి పండు ముదుసలి వరకు మహిళ అయితే చాలు, మృగాళ్లుగా మారిపోతున్నారు. ప్రభుత్వాలు ఎన్ని కఠిన శిక్షలు అమలు చేస్తున్నప్పటికీ, ఎన్ని చట్టాలు అమల్లోకి వస్తున్నప్పటికీ ఆడపిల్లలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. తాజాగా ఎనిమిదేళ్ల బాలికను దారుణంగా రేప్ చేసిన ఘటన వెలుగు చూసింది. చికిత్స పొందుతూ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. వివరాల్లోకి వెళితే..
బిహార్లోని నలందా జిల్లాకు నోయిడా గ్రామంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన జీతూ అనే యువకుడు నోయిడా పరిధిలోని సలార్పూర్లో తన మేనమామ ఇంటికి సమీపంలోనే కుటుంబంతో నివాసం ఉండేవాడు. తన మేనమామ కూతురైన ఎనిమిదేళ్ల బాలికపై కన్నేశాడు. పొరుగునే ఉంటూ అదను కోసం ఎదురుచూశాడు. ఎవరూ లేని సమయం చూసి మైనర్ బాలికపై అత్యాచారానికి తెగబడ్డాడు. తీవ్ర రక్తస్రావంతో బాలిక పరిస్థితి విషమంగా మారింది. చిన్నారిపై అత్యాచారం జరిగినట్లు గుర్తించిన కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి కన్నుమూసింది. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిపై హత్య, రేప్, చిన్న పిల్లలపై లైంగిక నేరాల సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి చేసి దర్యాప్తు చేస్తున్నారు.