మహిళా రిపోర్టర్ పై బాడీ-షేమింగ్…సారీ చెప్పిన దుల్కర్ సల్మాన్..
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్.. ముంబైకి చెందిన మహిళా రిపోర్టర్కు సారీ చెప్పాడు. అతడు ప్రొడ్యూసర్ గా తీసిన తొలి మూవీ ‘వరనే అవశ్యముంద్’. శోభన, కల్యాణి ప్రియదర్శన్ లీడ్ రోల్స్ లో నటించారు. అనూప్ సత్యన్ డెరెక్షన్ చేసిన ఈ సినిమా ఫిబ్రవరి 7న ఆడియెన్స్ ను పలకరించింది. సినిమాలోని ఓ యాడ్ సీన్ లో ముంబైకి చెందిన రిపోర్టర్ ఫొటోను ఉపయోగించారు. దీంతో వివాదం రాజుకుంది. సదరు మహిళా రిపోర్టర్ ట్విటర్లో స్పందిస్తూ.. […]
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్.. ముంబైకి చెందిన మహిళా రిపోర్టర్కు సారీ చెప్పాడు. అతడు ప్రొడ్యూసర్ గా తీసిన తొలి మూవీ ‘వరనే అవశ్యముంద్’. శోభన, కల్యాణి ప్రియదర్శన్ లీడ్ రోల్స్ లో నటించారు. అనూప్ సత్యన్ డెరెక్షన్ చేసిన ఈ సినిమా ఫిబ్రవరి 7న ఆడియెన్స్ ను పలకరించింది.
సినిమాలోని ఓ యాడ్ సీన్ లో ముంబైకి చెందిన రిపోర్టర్ ఫొటోను ఉపయోగించారు. దీంతో వివాదం రాజుకుంది. సదరు మహిళా రిపోర్టర్ ట్విటర్లో స్పందిస్తూ.. దర్శక, నిర్మాతలపై విమర్శలు గుప్పించారు. తన పర్మిషన్ లేకుండా ఫొటో వినియోగించడంపై ఫైరయ్యారు. పబ్లిక్లో బాడీ-షేమింగ్ చేశారని, దుల్కర్ సారీ చెప్పాలని డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన దుల్కర్ ఆమెకు సారీ చెప్పాడు.
“ఇది మా సైడ్ నుంచి జరిగిన మిస్టేక్.. దీనికి బాధ్యత కూడా మాదే. మీ ఫొటోల్ని మూవీలోని సీన్ కు ఎందుకు ఉపయోగించారో డైరెక్షన్ డిపార్ట్మెంట్ ని అడిగి తెలుసుకుంటాం. మా వల్ల మీరు ఇబ్బందిపడ్డందుకు నా తరఫున, మూవీ యూనిట్ తరఫున క్షమాపణలు కోరుతున్నా. ఇది కావాలని చేసిన పని మాత్రం కాదు” అని దుల్కర్ ట్వీట్టర్ లో పేర్కొన్నాడు.
దర్శకుడు అనూస్ సత్యన్ కూడా రిపోర్టర్కు వివరణ ఇచ్చారు. “మీకు ఇబ్బంది కలిగించినందుకు క్షమించండి. మేము మహిళల్ని తక్కువ చెయ్యాలనుకోలేదు. ఈ సినిమా కథే సెక్సిజంకు వ్యతిరేకంగా ఉంటుంది. మూవీ యూనిట్ తరఫున క్షమాపణలు చెబుతున్నా” అని ట్వీట్ చేశారు.