మోహన్ లాల్ మ్యాజిక్ అంటే ఇదే, ‘దృశ్యం-2’ టీమ్కు సెల్యూట్
ఒకప్పుడు సినిమా షూటింగ్స్ వేరు..ఇప్పటి షూటింగ్స్ వేరు. ఇప్పుడు తక్కువ కాస్ట్ అండ్ క్రూతో చిత్రీకరణ జరపడం అంటే మాములు విషయం కాదు.
ఒకప్పుడు సినిమా షూటింగ్స్ వేరు..ఇప్పటి షూటింగ్స్ వేరు. ఇప్పుడు తక్కువ కాస్ట్ అండ్ క్రూతో చిత్రీకరణ జరపడం అంటే మాములు విషయం కాదు. ఎందుకంటే బడ్జెట్లు, మార్కెట్లు పెరిగిపోయాయి. సో..తక్కువ వనరులతో షూటింగ్ చేయడానికి వీలు లేదు. ఇక స్టార్ హీరో సినిమా అయిలే కథ వేరే ఉంటది. వందల మంది జూనియర్ ఆర్టిస్టులు, సెట్లు, ప్రాపర్టీలు, లైట్లు ఆ లెక్కే వేరు. రోజుకు రెండు, మూడు సీన్లు తీస్తేనే గొప్ప విషయం. మంచి అవుట్ పుట్ కావాలంటే 6, 7 నెలల సమయం మినిమం కావాలి. కానీ మలయాళ సూపర్ స్టార్ మోహన్లాల్ను హీరోగా పెట్టి కరోనా కండీషన్స్ మధ్య షూటింగ్ చేస్తూ కేవలం 40 రోజుల్లో ఒక మూవీకి పూర్తి చేశారంటే ఆశ్యర్యం కలగక మానదు.
ఏడేళ్ల కిందట వచ్చిన మలయాళ బ్లాక్బస్టర్ చిత్రం దృశ్యంకు సీక్వెల్గా దృశ్యం-2ను సెప్టెంబరు 25న ఆరంభించింది మూవీ యూనిట్. మధ్యలో ఎన్ని రోజులు విరామం తీసుకున్నారో ఏంటో తెలియదు కానీ.. నవంబరు 6వ తేదీన టాకీ పార్ట్ మొత్తం కంప్లీట్ చేసింది దృశ్యం టీం. కరోనా టైంలో ఒక పెద్ద స్టార్ సినిమా ఇంత వేగంగా పూర్తి కావడం షాకిచ్చే అంశమే. చాలా ఇండస్ట్రీలలోని హీరోలకు, మేకర్స్కు ఛాలెంజింగ్ విషయమే. కాగా ఈ సీక్వెల్ను కూడా జీతూ జోసెఫే తెరకెక్కిస్తున్నారు. మీనానే మోహన్ లాల్ భార్య పాత్ర పోషిస్తోంది. దృశ్యంలో చేసిన చిన్నమ్మాయి ఇందులోనూ నటించింది. పెద్దమ్మాయి పాత్రను వేరే నటి కనిపించనుంది. మరి దృశ్యం-2 ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
Also Read :
భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్..సర్వదర్శనం టోకెన్ల జారీ కేంద్రాలు పెంపు