కరోనా క్రైసిస్ లో మంచు లక్ష్మీని టార్గెట్ చేసిన ఆర్జీవీ…
రామ్ గోపాల్ వర్మ..ఒకప్పుడు ఈ పేరు సినిమాలతో సెన్సేషన్..కానీ ఇప్పుడు వివాదాల కాంబినేషన్. ఎప్పుడూ ఎవరో ఒక సెలబ్రిటీని టార్గెట్ చేస్తూ..వారి ఫ్యాన్స్ తో అక్షింతలు వేయించుకోవడం ఆర్జీవీకి అలవాటు. అలాగని ఆర్జీవీకి అభిమానులు లేరనుకుంటే..తప్పులో కాలేసినట్టే. ఆయన్ని సపోర్ట్ చేసే వర్గం ఎప్పుడూ ఉండనే ఉంటుంది. ప్రస్తుతం కరోనా క్రైసిస్ లో ఇటీవలే చంద్రబాబు అండ్ కోని టార్గెట్ చేసిన ఆర్జీవీ మనసు తాజాగా మంచి లక్ష్మీ వైపుకు మళ్లింది. ప్రస్తుతం ప్రపంచం అంతా కరోనా […]
రామ్ గోపాల్ వర్మ..ఒకప్పుడు ఈ పేరు సినిమాలతో సెన్సేషన్..కానీ ఇప్పుడు వివాదాల కాంబినేషన్. ఎప్పుడూ ఎవరో ఒక సెలబ్రిటీని టార్గెట్ చేస్తూ..వారి ఫ్యాన్స్ తో అక్షింతలు వేయించుకోవడం ఆర్జీవీకి అలవాటు. అలాగని ఆర్జీవీకి అభిమానులు లేరనుకుంటే..తప్పులో కాలేసినట్టే. ఆయన్ని సపోర్ట్ చేసే వర్గం ఎప్పుడూ ఉండనే ఉంటుంది. ప్రస్తుతం కరోనా క్రైసిస్ లో ఇటీవలే చంద్రబాబు అండ్ కోని టార్గెట్ చేసిన ఆర్జీవీ మనసు తాజాగా మంచి లక్ష్మీ వైపుకు మళ్లింది.
ప్రస్తుతం ప్రపంచం అంతా కరోనా చుట్టూ తిరుగుతోన్న నేపథ్యంలో..అందరూ ఇంట్లో ఉంటూ..సోషల్ మీడియాకు అతుక్కుపోతున్నారు. కొందరు టిక్టాక్ వీడియోస్ చేస్తూ అటెన్షన్ గ్రాబ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ సరదా వీడియోని తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశాడు ఆర్జీవీ. వీడియోలో ఓ చిన్నపాపను వాళ్ల అమ్మ..’ఒంటికి బలమొస్తది..మిల్క్ తాగుతావా’ అని అడుగుతుంది. అప్పుడు ఆ పాప మంచు లక్ష్మీని ఇమిటేట్ చేస్తూ రిప్లై ఇస్తుంది. ఆ వీడియోను నెటిజన్లతో పంచుకున్న రామ్ గోపాల్ వర్మ..” కరోనా నుంచి కాస్తా గ్యాప్ తీసుకొండి. ఈ పాప ఎవరని ఇమిటేట్ చేసిందే తెలిస్తే నాకు చెప్పండి” అంటూ ట్వీట్ చేసాడు. దీనికి మరికొందరు నెటిజన్లు మంచు లక్ష్మీ పన్నీ వీడియోలను జత చేస్తున్నారు. ఇక వర్మ ట్వీట్ చూసిన మంచు లక్ష్మీ ‘సార్’ అంటూ నవ్వుతోన్న ఈమోజీస్ పెట్టింది.
Sarrr ??
— Lakshmi Manchu (@LakshmiManchu) March 29, 2020