Crime News: రాజేంద్రనగర్‌లో దారుణం.. భర్తపై కోపంతో ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య!

|

Dec 11, 2021 | 9:09 PM

హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలో దారుణం జరిగింది. ఇద్దరు కన్నబిడ్డలను చంపిన తల్లి ఆత్మహత్య బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘ‌ట‌న స్థానికంగా క‌ల‌క‌లం రేపుతోంది.

Crime News: రాజేంద్రనగర్‌లో దారుణం.. భర్తపై కోపంతో ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య!
Family Suicide
Follow us on

Rajendranagar Family Suicide:హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలో దారుణం జరిగింది. ఇద్దరు కన్నబిడ్డలను చంపిన తల్లి ఆత్మహత్య బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘ‌ట‌న స్థానికంగా క‌ల‌క‌లం రేపుతోంది. రాజేంద్ర నగర్ ప్రాంతానికి చెందిన స్వాతి(35) అనే మహిళ తన ఇద్దరు అమ్మాయిలు శ్రేయ(3), తన్విక్(5) ఉరివేసి అనంతరం ఆమె కూడా ఆత్మహత్య చేసుకుంది. భర్త సాయి కుమార్‌ వేధింపులు భరించలేకనే పిల్లల్ని చంపి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు స్వాతి సూసైడ్‌ నోట్ రాసిందని పోలీసులు తెలిపారు. ఈ దిశగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

రాజేంద్రనగర్ పోలీస్టేషన్ పరిధిలోని పోట్వీ కాలనీ శ్రీనివాస అపార్ట్‌మెంట్ ఫ్లాట్ నెంబర్ 101లో సాయి కిరణ్, స్వాతి దంపతులు నివాసముంటున్నారు. సాయి కిరణ్‌, స్వాతి ఇద్దరూ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు పనిచేస్తున్నారు. సాయి చేసిన అప్పులు తీర్చలేక తరుచు భార్యతో గొడవకు దిగే వాడు. ఈ క్రమంలోనే గత కొన్ని రోజుల నుంచి భర్తతో స్వాతికి తీవ్రస్థాయిలో వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇదే క్రమంలో శనివారం సాయంత్రం సైతం భర్తతో గొడవ జరిగింది. గొడవ అనంతరం భర్త ఇంటి నుంచి వెళ్లిపోవడంతో ఇద్దరు పిల్లల్ని చంపి స్వాతి ఆత్మహత్య చేసుకుంది. భర్త వేధింపుల వల్లే చనిపోతున్నట్లు సూసైడ్‌ నోట్‌ రాసింది. తన భర్త సాయికుమార్‌ సైకోలా వేధించాడని, అక్కా.. చెల్లెళ్లతో మాట్లాడినా అనుమానపడేవాడని వాపోయింది. ముగ్గురి మరణవార్త విష‌యం తెలుసుకున్న పోలీసులు ఘ‌ట‌న స్థ‌లానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించి, మృతికి చెందడానికి గ‌ల కార‌ణాలను ఆరా తీస్తున్నారు. కాగా, ఘటనకు సంబంధించి కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌డుతున్న రాజేంద్ర‌న‌గ‌ర్ పోలీసులు పేర్కొన్నారు.

రాజేంద్రనగర్ ప్రాంతంలో ఇటీవ‌లే ఓ చిన్నారి అదృశ్య‌మై.. శ‌వ‌మై తేల‌డం మ‌ర‌వ‌క ముందే.. నిన్న భ‌ర్త భార్య‌పై అనుమానంతో త‌ల న‌రికి త‌ల‌తో పాటు పోలీస్ స్టేష‌న్‌కు వెళ్లాడు. ఆ ఘ‌ట‌న గ‌డిచి 24 గంట‌లు దాట‌క ముందే మ‌రొక ఘ‌ట‌న చోటు చేసుకోవ‌డం గ‌మ‌నార్హం.

Read Also…  Nithya Menon : ప్రభాస్ ఇష్యూ ఇప్పటికీ నన్ను బాధపెడుతూనే వుంది.. ఆసక్తికర కామెంట్స్ చేసిన నిత్యామీనన్