Toll Plaza Lorry Accident: టోల్‌ ఫ్లాజా వద్ద లారీ బీభత్సం… అదుపుతప్పి దూసుకెళ్లిన వాహనం.. ఇద్దరికి తీవ్ర గాయాలు

|

May 03, 2021 | 9:43 PM

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణిగుంట వద్ద ఓ లారీ బీభత్సం సృష్టించింది. టోల్ ఫ్లాజా వద్ద అదుపుతప్పి ఓ లారీ.. బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో ఇద్దరికీ తీవ్రంగా గాయాలయ్యాయి.

Toll Plaza Lorry Accident: టోల్‌ ఫ్లాజా వద్ద లారీ బీభత్సం... అదుపుతప్పి దూసుకెళ్లిన వాహనం.. ఇద్దరికి తీవ్ర గాయాలు
Renigunta Toll Plaza Lorry Accident
Follow us on

Toll Plaza Lorry Accident: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణిగుంట వద్ద ఓ లారీ బీభత్సం సృష్టించింది. టోల్ ఫ్లాజా వద్ద అదుపుతప్పి ఓ లారీ.. బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో ఇద్దరికీ తీవ్రంగా గాయాలయ్యాయి. రేణికుంట టోల్ గేటు వద్ద మరమ్మత్తు చేస్తుండగా.. వేగంగా ఢీకొట్టింది. హైదరాబాద్ నుండి కరీంనగర్ వైపు వేగంగా వస్తున్న లారీ టోల్ గేట్ వద్దకు రాగానే అదుపు తప్పడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.  డ్రైవర్ అజాగ్రత్తగా అతివేగంగా నడపడమే లారీ ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరి వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిద్దరిని స్థానికుల సహయంతో పోలీసులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడ్డవారిని రేణుకుంట గ్రామానికి చెందిన.. బోయిని లింగయ్య, మరో వ్యక్తి గా గుర్తించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Read Also….