Mumbai as cocaine capital: డ్రగ్స్ దందాపై ఎన్‌సీబీ సంచలన నిజాలు వెల్లడి.. ఆస్ట్రేలియా, కెనడాతో ముంబై లింకులు..!

|

Apr 02, 2021 | 6:36 PM

దేశ ఆర్థిక రాజధాని ముంబై డ్రగ్స్ దందాకు అడ్డాగా మారిపోయిందా అంటే ఔననే అంటోంది కేంద్ర హోం మంత్రిత్వ శాఖ. ఈ మేరకు తాజా నివేదికను విడుదల చేసింది.

Mumbai as cocaine capital: డ్రగ్స్ దందాపై ఎన్‌సీబీ సంచలన నిజాలు వెల్లడి.. ఆస్ట్రేలియా, కెనడాతో ముంబై లింకులు..!
Narcotics Control Bureau Red Flags Mumbai As Cocaine Capital Of India
Follow us on

Cocaine capital of India: దేశ ఆర్థిక రాజధాని ముంబై డ్రగ్స్ దందాకు అడ్డాగా మారిపోయిందా అంటే ఔననే అంటోంది కేంద్ర హోం మంత్రిత్వ శాఖ. ఈ మేరకు తాజా నివేదికను విడుదల చేసింది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) విచారణలో ఈ విషయం వెల్లడైందని తెలిపింది. ప్రపంచ కొకైన్ వినియోగానికి ముడి కోకా పేస్ట్‌ను ప్రాణాంతక డ్రగ్స్ ప్రాసెస్ చేయడానికి భారతదేశం ఉపయోగిస్తున్నట్లు ఎన్‌సీబీ అనుమానిస్తోంది.

దేశంలోని పలు నగరాలకు ప్రధాన గమ్యస్థానంగా ముంబై ఉందని.. దేశవ్యాప్తంగా కనెక్షన్లు ఉన్నాయని పేర్కొంది. పలువురి నుంచి డ్రగ్స్ సీజ్ చేయడంతో పాటు అరెస్టులు చేయడంతో ఈ విషయం వెలుగుచూసిందని కేంద్రం తెలిపింది. ఎన్సీబీ విచారణలో డ్రగ్ దందాపై పెద్ద ఎత్తున ఆపరేషన్స్ జరుగుతున్నాయని తేలిందన్నారు. భారతదేశం, కెనడా, అమెరికా, ఆస్ట్రేలియాలో మాదకద్రవ్యాల మాఫియా వ్యాప్తి చెందడానికి మెట్రోపాలిటన్ నగరాలు వెనుకబాటు తనమే కారణమని ఎన్‌సీబీ పేర్కొంది. ముంబై కేంద్రంగా పెద్ద ఎత్తున డ్రగ్స్ దందా కొనసాగుతున్నట్లు ఎన్‌సీబీ వెల్లడించింది.

ఇటీవల వాసాయ్ కు చెందిన ఎం అహ్మద్ నుంచి 2 కిలోల పీసీపీ 1కేజీ కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో ఎస్కే సౌరభ్ నుంచి డ్రగ్స్ వస్తుందని అహ్మద్ తెలిపారు. ఈ క్రమంలోనే ఎస్కే సౌరభ్ ను పట్టుకొని సోదాలు చేయగా.. గోడౌన్ లలో 29.300 కేజీల ఎండీఏ డ్రగ్ దొరికిందన్నారు. ఈ సమాచారంతోనే జమ్మూలోనూ పెద్ద ఎత్తున డ్రగ్స్ దందా బయటపడింది. శ్రీలంకలో గత రెండేళ్లలో స్వాధీనం చేసుకున్న 2,499 కిలోగ్రాముల కొకైన్.. భారత్‌లోని పోర్ట్ ఎలిజబెత్, పనానా కేంద్రంగా కేంద్రంగా సరఫరా అయ్యినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ ప్రాణాంతక డ్రగ్స్ విలువ అంతర్జాతీయ మార్కెట్ కిలోకు ₹ 5 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు.

ఇక తాజాగా నిర్వహించిన ఆపరేషన్ లో నైజీరియన్ దేశస్థుడైన ఉకా ఉమేకాను ఎన్సీబీ అరెస్ట్ చేసింది. ఈ డ్రగ్ ను దక్షిణ అమెరికా దేశం నుంచి వచ్చినట్టు పోలీసుల విచారణలో తేలింది. మొత్తం దేశంలోని వివిధ ప్రాంతాలు వివిధ దేశాల నుంచి ముంబైకే నేరుగా డ్రగ్స్ వస్తున్నాయని.. డ్రగ్ దందాకు ముంబై అడ్డాగా మారిందని కేంద్ర హోంశాఖ తెలిపింది.

పూర్తి రసాయనమైన పొటాషియం పర్మాంగనేట్ అతిపెద్ద తయారీదారులలో ఒకటైన, కొకైన్ ప్రాసెసింగ్‌ను దక్షిణ అమెరికా నుండి భారతదేశానికి డ్రగ్ కార్టెల్ ద్వారా మార్చవచ్చనే అనుమానం పెరుగుతోంది. దీనికి ప్రధానంగా యుఎస్ డ్రగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీ, యుకేకు చెందిన నేషనల్ క్రైమ్ ఏజెన్సీ, రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ (ఆర్‌సిఎంపి), ఆస్ట్రేలియా డ్రగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు దక్షిణ అమెరికా కోకా ఉత్పత్తి చేసే దేశాలపై ఒత్తిడి తెచ్చాయి.

Mumbai As Cocaine Capital Of India

భారతదేశం, ఆస్ట్రేలియా, కెనడాలోని లింక్‌లతో సిండికేట్ ద్వారా 2018 డిసెంబర్‌లో 300 కిలోల కొకైన్ ( అంతర్జాతీయ మార్కెట్‌లో దీని విలువ రూ.1,500 కోట్లు) ముంబైలో అడుగుపెట్టినట్లు బ్యాక్‌ట్రాక్ డ్రగ్ పరిశోధనలు నిర్ధారించాయని ఎన్‌సీబీ ఉన్నతాధికారులు తెలిపారు. అదే సిండికేట్ కెనడా నుండి ఆస్ట్రేలియాకు 200 కిలోల మెథాంఫేటమిన్ అక్రమ రవాణాకు పాల్పడిందని ఎన్‌సీబీ వెల్లడించింది.

Read Also…  Road Accident: నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురి మృతి!