Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఎదురెదురుగా ఢీకొన్న బైక్‌లు.. ముగ్గురు దర్మరణం

Suryapet Road Accident: రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అజాగ్రత్త, ఓవర్‌టెక్‌, మద్యం తాగి వాహనాలు నడపడం, తదితర కారణాల వల్ల అమాయకులు బలవతున్నారు..

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఎదురెదురుగా ఢీకొన్న బైక్‌లు.. ముగ్గురు దర్మరణం

Updated on: Feb 11, 2022 | 10:36 AM

Suryapet Road Accident: రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అజాగ్రత్త, ఓవర్‌టెక్‌, మద్యం తాగి వాహనాలు నడపడం తదితర కారణాల వల్ల అమాయకులు బలవతున్నారు. రోడ్డు ప్రమాదాలు జరుగకుండా పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా జరుగుతూనే ఉన్నాయి. ఇక తాజాగా తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. జిల్లాలోని ఆత్మకూరు (ఎస్‌) మండలం నశింపేట వద్ద గురువారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు క్షతగాత్రుల్లో చికిత్స నిమిత్తం వెంటనే సమీప ఆస్పత్రికి తరలించారు.

అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. మృతులు లక్ష్మీనాయక్‌ తండా, బోట్యతండా, తెట్టెకుంట తండా వాసులుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి:

Rana Ayyub: మనీలాండరింగ్ కేసు.. జర్నలిస్ట్ రాణా ఆయుబ్‌కు బిగిస్తున్న ఉచ్చు..

Lakhimpur Kheri violence: యూపీలో కీలక పరిణామం.. లఖీంపూర్ ఖేరి ఘటనలో కేంద్రమంత్రి కుమారుడికి బెయిల్