
Uttar Pradesh Road Accident: ఉత్తరప్రదేశ్లో ఇటీవలకాలంలో వరుసగా రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఈ సంఘటనల్లో పలువురు మరణించగా.. చాలామంది గాయాలపాలయ్యారు. తాజాగా ఉత్తరప్రదేశ్లో మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. యూపీలోని కాన్పూర్ జిల్లా బిల్హౌర్ ప్రాంతంలో ప్రయాణికులతో వెళుతున్న టెంపో, డంపర్ రెండు ఒకదానికొకటి ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. మరో ఏడుగురు ప్రయాణికులు గాయాలపాలయ్యారు. ఈ సంఘటన గురువారం అర్థరాత్రి జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
ఈ సంఘటనపై బిల్హౌర్ సబ్-ఇన్స్పెక్టర్ విజయ్ సింగ్ మాట్లాడుతూ.. తమ సిబ్బంది సమయానికి సంఘటన స్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారని తెలిపారు. అప్పటికే ముగ్గురు వ్యక్తులు మరణించారని పేర్కొన్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. మృతదేహాలను పోస్ట్మార్టం కోసం ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు. ఈ సంఘటన అనంతరం డంపర్ డ్రైవర్ తప్పించుకున్నాడని.. అతనికోసం గాలిస్తున్నామన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: