Murder News: ప్రేమించాడని.. యువకుడి మర్మాంగం కోసి దారుణ హత్య

|

Jul 25, 2021 | 12:11 PM

బిహార్​ ముజఫర్​పుర్​ జిల్లాలో శనివారం దారుణం చోటుచేసుకుంది.  ఓ యువకుడిని.. తాను ప్రేమించిన యువతి సోదరులే అత్యంత కిరాతకంగా హత్య చేశారు...

Murder News:  ప్రేమించాడని.. యువకుడి మర్మాంగం కోసి దారుణ హత్య
Love Murder
Follow us on

బిహార్​ ముజఫర్​పుర్​ జిల్లాలో శనివారం దారుణం చోటుచేసుకుంది.  ఓ యువకుడిని.. తాను ప్రేమించిన యువతి సోదరులే అత్యంత కిరాతకంగా హత్య చేశారు. దాంతో ఆగ్రహానికి గురైన బాధితుడి కుటుంబ సభ్యులు.. అతడి మృతదేహాన్ని నిందితుల ఇంటి ముందే దహనం చేశారు.

వివరాలు ఇలా ఉన్నాయి….

ముజఫర్​పుర్​ జిల్లా.. రామ్​పురుశాహ్​ ఏరియాకి చెందిన సౌరభ్​రాజ్(22)​.. సోనావర్ష గ్రామానికి చెందిన ఓ యవతి ప్రేమించుకున్నారు. అయితే వీరి ప్రేమను యవతి సోదరులు మొదటి నుంచి వ్యతిరేకిస్తూనే ఉన్నారు. వారు సన్నిహితంగా మెలగడం ఓర్వలేక శనివారం దారుణానికి ఒడిగట్టారు. తన ప్రేయసి పిలుస్తున్నట్లుగా నమ్మించి సౌరభ్​ను తమ ఇంటి వద్దకు పిలిపించారు. అనంతరం.. అతడ్ని గదిలో బంధించి తీవ్రంగా దాడి చేశారు. అంతేకాకుండా.. సౌరభ్​ మర్మాంగం కోసి చిత్రహింసలు పెట్టారు. దాంతో తీవ్ర రక్తస్రావం కాగా చనిపోతాడని భావించిన నిందితులు.. సౌరభ్​ను ఓ ఆస్పత్రిలో చేర్చి ఎస్కేప్ అయ్యారు. అయితే.. అక్కడే అతడు మృతి చెందాడు. సౌరభ్​ చనిపోవడంతో అతడి కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలోకి వెళ్లిపోయారు. ఈ ఘటనతో అతని గ్రామస్థులంతా ఆగ్రహానికి గురయ్యారు. పోస్టు మార్టం నిర్వహించిన అనంతరం.. సౌరభ్​ డెడ్‌బాడీని తీసుకుని వచ్చి నిందితుడి ఇంటి ముందుకు తీసుకువచ్చి ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్​ చేశారు. మృతదేహాన్ని ఆ ఇంటివద్దే దహనం చేశారు. ఈ ఘటనలో పోలీసులు.. పలువురిపై కేసు నమోదు చేశారు. ఉద్రిక్తతలు నెలకొనగా.. పోలీసులు భారీగా మోహరించారు. ఒడిశాలోని ఓ ప్రైవేట్​ సంస్థలో సౌరభ్​ రాజ్​ పని చేస్తుంటాడని సమాచారం. తన సోదరి వివాహం ఉన్నందున జులై 1నే అతడు సెలవులపై ఇంటికి వచ్చినట్లు తెలుస్తోంది.

Also Read:  పోలీసుల వినూత్న ప్రయత్నం.. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డారో ఇకపై ‘రంగు’ పడుద్ది..

రజత పతకధారి మీరాబాయి చానుకి బంఫర్ ఆఫర్..!