Shocking: వామ్మో…! స్పీకర్‌లో మ్యూజిక్ సైండ్ తగ్గించినందుకు పక్కింటి వ్యక్తిని చంపేశాడు..

|

Dec 10, 2021 | 9:42 PM

మనుషులకు పేషెన్స్ తగ్గిపోతుంది. చిన్న, చిన్న విషయాలకే టెంపర్ లేచిపోతుంది. మనం మనుషులుం.. విచక్షణతో ఉండాలి అన్న నియమాన్ని మరిచిపోతున్నారు.

Shocking: వామ్మో...! స్పీకర్‌లో మ్యూజిక్ సైండ్ తగ్గించినందుకు పక్కింటి వ్యక్తిని చంపేశాడు..
Murder
Follow us on

మనుషులకు పేషెన్స్ తగ్గిపోతుంది. చిన్న, చిన్న విషయాలకే టెంపర్ లేచిపోతుంది. మనం మనుషులుం.. విచక్షణతో ఉండాలి అన్న నియమాన్ని మరిచిపోతున్నారు. కోపం వస్తే ఎదుటివారిపై విచక్షణారహితంగా దాడి చేస్తున్నారు. చేతికి ఏది దొరికితే.. దానితో దాడికి తెగబడుతున్నారు. తాజాగా అలాంటి మహారాష్ట్రలోని ముంబైలో అటువంటి షాకింగ్ ఘటనే జరిగింది. ఒక వ్యక్తి తన మ్యూజిక్ సిస్టమ్‌లో ఎక్కవ సౌండ్ పెడుతున్నాడని.. అతని పక్కింటి వ్యక్తి దాడి చేశాడు. దీంతో అతడు స్పాట్‌లోనే ప్రాణాలు విడిచాడు. 25 ఏళ్ల నిందితుడిని ఇప్పుడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరణించిన వ్యక్తి మ్యూజిక్ సౌండ్ తగ్గించడానికి నిరాకరించడంతో..  గొడవ జరిగింది. చివరకు అది ఘర్షణగా మారి ప్రాణాలు తీసేవరుకు వెళ్లింది. మరణించిన వ్యక్తిని సురేంద్ర గౌడ్ (47)గా గుర్తించారు. బుధవారం ముంబై మలాడ్‌లోని.. మాల్వానీ కాలనీ ఏక్తా చాల్ సొసైటీలో జరిగిన ఈ దారుణమైన మర్డర్ వార్త ఆలస్యంగా వెలుగుచూసింది.

మృతుడు, నిందితులు ఇద్దరూ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడిని సైఫ్ అలీ షేక్ (25)గా తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మరణించిన వ్యక్తి తన ఇంటి వెలుపల తన టేప్ రికార్డర్‌లో పాటలు వింటున్నాడు. నిందితుడు అతనిని వాల్యూమ్ తగ్గించమని అడిగాడు. దీనిపై ఇరువురి మధ్య గొడవ జరిగింది. ఘర్షణలో బాధితుడు తలకు గాయాలై.. మరణించాడు. అయితే నిందితుడుకి బాధితుడిని చంపాలనే ఉద్దేశ్యం లేదని.. క్షణికావేశంలోనే హత్య జరిగిందని పోలీసులు తెలిపారు.  బాధితురాలి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని ఐపీసీ సెక్షన్ 302 (హత్య) కింద అభియోగాలు మోపారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచి.. న్యాయమూర్తి ఆదేశాలు అనంతరం కస్టడీకి తరలించారు.

Also Read: చిన్నారి ప్రయాణిస్తోన్న కార్ మాత్రమే కాదు.. తన మనసు కూడా చాలా రిచ్.. మనసును కదిలించే వీడియో

 రాజమౌళి డైరెక్షన్​ను డామినేట్​ చేసిన హీరో అతనొక్కడే.. కీలక కామెంట్ చేసిన కీరవాణి