Gadchiroli : మహారాష్ట్రలో భారీ ఎన్‌కౌంటర్‌, గడ్చిరోలిలో ఎదురు కాల్పులు.. 16 మంది మావోయిస్టులు మృతి.!

Encounter in Gadchiroli : ఒకపక్క కనిపించని కరోనా మహమ్మారితో దేశ ప్రజలు పిట్టల్లా రాలిపోతుంటే, మరోవైపు మహారాష్ట్రలో శుక్రవారం ఉదయం భారీ ఎన్‌కౌంటర్‌..

Gadchiroli : మహారాష్ట్రలో భారీ ఎన్‌కౌంటర్‌,  గడ్చిరోలిలో ఎదురు కాల్పులు..  16 మంది మావోయిస్టులు మృతి.!
Gadchiroli Encounter

Edited By: Janardhan Veluru

Updated on: May 21, 2021 | 10:05 AM

Encounter in Gadchiroli : ఒకపక్క కనిపించని కరోనా మహమ్మారితో దేశ ప్రజలు పిట్టల్లా రాలిపోతుంటే, మరోవైపు మహారాష్ట్రలో శుక్రవారం ఉదయం భారీ ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. గడ్చిరోలి జిల్లాలోని ఎటపల్లి అటవీ ప్రాంతంలోవద్ద సీ-60 యూనిట్‌ మహారాష్ట్ర పోలీసులకు, మావోయిస్టులకు మధ్య పెద్ద ఎత్తున ఎదురుకాల్పులు జరిగాయి. అయితే, పోలీసుల కాల్పుల్లో ఏకంగా 13 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. మృతుల సంఖ్య ఇంకా ఉండవచ్చని భావిస్తున్నారు. ఇప్పటి వరకు 13 మృతదేహాలను, ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాల్పులు కొనసాగుతుండడంలో ప్రస్తుతం గడ్చిరోలి ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. కాగా, పెద్ద ఎత్తున మావోయిస్టులు మృతి చెందడంతో దండకారణ్యం నెత్తురోడింది. ధనోరా తాలుకా కోట్మీ అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా పోలీసులకు మావోయిస్టులు ఎదురు పడ్డట్టు సమాచారం. ప్రస్తుతం ఏటపల్లిలో ఏరియాలో పోలీసులు గాలింపు చర్యలు, కూంబింగ్ కొనసాగిస్తున్నారు.

Read also : INS Rajput : నలభైఒక్కేళ్లపాటు భారత నావికాదళానికి కొండంత అండగా నిలిచిన ‘ఐఎన్‌ఎస్‌ రాజ్‌పుత్’ నిష్క్రమణ నేడే