జమ్మూ కాశ్మీర్ భద్రతా బలగాల భారీ విజయం.. రెండు ఎన్‌కౌంటర్లలో ‘లష్కరే తోయిబా’ కమాండర్‌ సహా ఇద్దరు ఉగ్రవాదులు హతం

జమ్మూ కాశ్మీర్‌లో ఆపరేషన్‌లో భద్రతా బలగాలు ఘన విజయం సాధించాయి. ఇక్కడ జరిగిన ఎన్‌కౌంటర్‌లో లష్కరే తోయిబా కమాండర్ నిసార్ దార్ హతమయ్యాడు.

జమ్మూ కాశ్మీర్ భద్రతా బలగాల భారీ విజయం.. రెండు ఎన్‌కౌంటర్లలో 'లష్కరే తోయిబా' కమాండర్‌ సహా ఇద్దరు ఉగ్రవాదులు హతం
Encounter
Follow us

|

Updated on: Apr 09, 2022 | 9:36 AM

Jammu and Kashmir Encounter: జమ్మూకశ్మీర్‌లోని కీలక ప్రాంతాల్లో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. స్థానిక వార్తా సంస్థ ద్వారా అందిన సమాచారం ప్రకారం, అనంతనాగ్ జిల్లా(Anantnag District)లోని సిర్హామా ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరుగుతోంది. ఇక్కడ పోలీసులు, భద్రతా దళాలు ఆపరేషన్(Search Operation) నిర్వహిస్తున్నాయి. ఈ ఆపరేషన్‌లో భద్రతా బలగాలు ఘన విజయం సాధించాయి. ఇక్కడ జరిగిన ఎన్‌కౌంటర్‌లో లష్కరే తోయిబా(Lashkar-e-Taiba) కమాండర్ నిసార్ దార్ హతమయ్యాడు. మరోవైపు భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ విస్తృతంగా కొనసాగిస్తున్నారు. ముందుజాగ్రత్త చర్యగా అనంతనాగ్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశారు.

ఇది కాకుండా, కుల్గామ్‌లో కూడా ఉగ్రవాదులు భద్రతా దళాల మధ్య ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది. కుల్గామ్‌లోని ధిపోరా ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్ జరుగుతున్నట్లు కశ్మీర్ ఐజీపీ తెలిపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో నిషేధిత ఉగ్రవాద సంస్థ ‘లష్కరే తోయిబా’కు చెందిన స్థానిక ఉగ్రవాది హతమయ్యాడు. మరోవైపు, సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. అనంత్‌నాగ్‌లో లష్కర్ ఉగ్రవాదులు, కుల్గామ్‌లో జైషే మహ్మద్ ఉగ్రవాదులు చిక్కుకున్నారని, కుల్గామ్‌లో జరుగుతున్న ఎన్‌కౌంటర్‌లో జైషే ఉగ్రవాదులు చుట్టుముట్టారని ఐజీపీ కశ్మీర్ తెలిపారు.

షోపియాన్‌లో ఎన్‌కౌంటర్

ఇదిలావుంటే, జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో బుధవారం ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. షోపియాన్‌లోని హరిపోరా గ్రామంలో ఉగ్రవాదులు దాక్కున్నట్లు సమాచారం అందిందని, ఆ తర్వాత భద్రతా బలగాలు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్‌ను ప్రారంభించాయని పోలీసు అధికారి తెలిపారు. ఆపరేషన్ ఎన్‌కౌంటర్‌గా మారిందని అధికారి తెలిపారు. అటు, జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలోని త్రాల్ ప్రాంతంలో భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నిషేధిత ఉగ్రవాద సంస్థలైన అన్సార్ గజ్వాతుల్ హింద్, లష్కరే తోయిబాకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. పోలీసులు ఈ మేరకు సమాచారం ఇచ్చారు.

ఉగ్రవాదుల గుర్తింపు

ఉగ్రవాదులను అన్సార్ గజ్వాతుల్ హింద్‌కు చెందిన సఫత్ ముజఫర్ సోఫీ అలియాస్ మువావియా, లష్కర్‌కు చెందిన ఉమర్ తేలీ అలియాస్ తల్హాగా గుర్తించినట్లు పోలీసు అధికారి తెలిపారు. ఈ ఏడాది ప్రారంభంలో శ్రీనగర్‌లోని ఖోన్‌మో ప్రాంతంలో సర్పంచ్‌ హత్యతో పాటు పలు ఉగ్రవాద కేసుల్లో వీరిద్దరూ వాంటెడ్‌గా ఉన్నారని చెప్పారు. ఇద్దరు ఉగ్రవాదులు ఇటీవల త్రాల్‌లో తమ స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారని పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

Read Also… AP CM YS Jagan: వెంట్రుక కూడా పీకలేరు అన్న ఏపీ సీఎం జగన్ వ్యాఖ్యల వెనుక వ్యూహం దాగి ఉందా?

టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు