దారుణం: మనవరాలిని చంపేసిన తాతయ్య, నాన్నమ్మలు

| Edited By: Srinu

Jan 23, 2020 | 1:10 PM

తాతాయ్యా, నాన్నమ్మలు కలిసి మనవరాలిని హతమార్చిన ఘటన ఆంధ్రప్రదేశ్ కృష్నా జిల్లా ఇబ్రహీంపట్నంలో చోటుచేసుకుంది. మనవరాలు హేమను చంపేసి గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని గుంటూరు తీసుకెళ్లి అక్కడ నిర్మానుష్య ప్రాంతంలో కాల్చివేశారు గ్రాండ్ పేరంట్స్. అనంతరం తిరిగి వీరు ఇబ్రహీంపట్నం చేరుకున్నారు. హేమ తన తల్లిదండ్రుల వద్ద కాకుండా తాతమ్మ, నాన్నమ్మల వద్ద పెరుగుతోంది. అయితే.. కొన్ని రోజుల నుంచి బాలిక తల్లిదండ్రులతో ఫోన్‌లో మాట్లాడకపోవడంతో అనుమానమొచ్చిన తల్లిదండ్రులు.. ఇంటికి వచ్చారు. అక్కడ వాళ్ల కూతరు హేమ […]

దారుణం: మనవరాలిని చంపేసిన తాతయ్య, నాన్నమ్మలు
Follow us on

తాతాయ్యా, నాన్నమ్మలు కలిసి మనవరాలిని హతమార్చిన ఘటన ఆంధ్రప్రదేశ్ కృష్నా జిల్లా ఇబ్రహీంపట్నంలో చోటుచేసుకుంది. మనవరాలు హేమను చంపేసి గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని గుంటూరు తీసుకెళ్లి అక్కడ నిర్మానుష్య ప్రాంతంలో కాల్చివేశారు గ్రాండ్ పేరంట్స్. అనంతరం తిరిగి వీరు ఇబ్రహీంపట్నం చేరుకున్నారు. హేమ తన తల్లిదండ్రుల వద్ద కాకుండా తాతమ్మ, నాన్నమ్మల వద్ద పెరుగుతోంది. అయితే.. కొన్ని రోజుల నుంచి బాలిక తల్లిదండ్రులతో ఫోన్‌లో మాట్లాడకపోవడంతో అనుమానమొచ్చిన తల్లిదండ్రులు.. ఇంటికి వచ్చారు. అక్కడ వాళ్ల కూతరు హేమ కనిపించకపోవడంతో.. అనుమానమొచ్చి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేయగా.. హత్య చేసింది తమ అత్తామామలేనని తేలింది. అయితే ఈ హత్యకు అసలు కారణం ఏంటనేది ఇంకా తెలియరాలేదు. నిందితులను పోలీసులు విచారిస్తున్నారు.