
ఎంత అవసరమొచ్చిందో ఏమో తెలీదు గానీ.. ఓ మాజీ మంత్రి ఓ మహిళ దగ్గర నుంచి భారీ మొత్తంలో డబ్బును అప్పుగా తీసుకున్నాడు. తీసుకున్న డబ్బును చెల్లించమని ఎన్నిసార్లు ఆమె అడిగినా.. ఆయన చెల్లించలేదు. దీంతో తీవ్ర ఆవేదనకు గురైన సదరు మహిళ ఆత్మహత్య చేసుకొని తనువు చాలించింది. ఈ సంఘటన కర్ణాటకలో జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరులోని చంద్రలేఔట్ పోలీస్స్టేషన్ పరిదిలో అంజనా వి. శాంతవేరి అనే మహిళ, మాజీ మంత్రి బాబు రావ్ చించనసూర్కు రూ.11.88కోట్లు అప్పుగా ఇచ్చారు. ఈ డబ్బును ఇతరుల దగ్గర నుంచి తీసుకొని ఆమె.. ఆయనకు ఇచ్చారు. అయితే ఆ తరువాత ఆ అప్పును అతడు చెల్లించలేదు. దీంతో ఏమీ చేయాలో పాలిపోని అంజనా.. మాజీ మంత్రిపై అంజన కేసు వేసింది. ఈ కేసు విచారణ జరుగుతుండగా.. మరోవైపు అంజనాకు అప్పుల వారి నుంచి ఒత్తిడి అధికమైంది. తమ వద్ద తీసుకున్న రుణాలను చెల్లించాలని వారు ఆమెను డిమాండ్ చేశారు. ఓ వైపు తాను ఇచ్చిన డబ్బులు రాకపోవడం, మరోవైపు ఒత్తిళ్లతో భరించలేకపోయిన ఆమె.. ఫ్యాన్కు ఆదివారం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు ముందు తన కుమారుడికి ఫోన్ చేసింది. ఇక ఈ ఘటనపై చంద్రలేఔట్ పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. కాగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేసిన బాబూరావ్ స్వస్థలం కలబుర్గి జిల్లాల చించోళి. ఇటీవల ఆయన బీజేపీలో చేరారు