Accident: పెను విషాదం.. ఆర్టీసీ-బస్సు కారు ఢీ.. ఐదుగురు మృతి

తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఘన్ పూర్ వద్ద ఆర్టీసీ, బస్సు కారు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు.

Accident: పెను విషాదం.. ఆర్టీసీ-బస్సు కారు ఢీ.. ఐదుగురు మృతి
Rtc Car Accident
Follow us

|

Updated on: Mar 28, 2022 | 11:29 AM

తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఘన్ పూర్ వద్ద ఆర్టీసీ, బస్సు కారు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. కరీంనగర్ డిపో -1 కు చెందిన ఆర్టీసీ బస్సు కరీంనగర్ నుంచి కామారెడ్డి వైపు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు, బాలుడు అక్కడికక్కడే మృతి చెందగా ఓ చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. కారులో మృతదేహాలు నుజ్జనుజ్జు కావడంతో వాటిని బయటకు తీసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

ఆర్టీసీ బస్సు ముందు టైర్‌ పేలడంతోనే ఈ ప్రమాదం సంభవించినట్లు స్థానికులు చెబుతున్నారు. కారు నెంబర్‌ ఆధారంగా మృతులంతా నిజామాబాద్‌ జిల్లాకు చెందిన వారిగా భావిస్తున్నారు. గాయపడిన చిన్నారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Also Read

Kidney Healthy Foods: కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి పదార్థాలు తినాలి.. ఏమి తినకూడదో తెలుసా..

TS Crime: కన్నకొడుకు క్రూరత్వం.. డబ్బుల కోసం కన్నతల్లిపై పెట్రోల్ పోసి.. అంతే కాకుండా

స్నేహితుడి పెళ్లికి అదిరిపోయే గిఫ్ట్ !! మేళతాలాలతో‏ ఊరేగింపుగా తీసుకెళ్లి మరీ ఇచ్చారు..