రూ.100 కోట్ల హెరాయిన్..పక్కా స్కెచ్..బట్..!
మత్తుమందు ఇప్పుడు దేశంలో ప్రధాన సమస్కల్లో ఒకటిగా మారింది. యువత వీటి భారిన పడి..జివితాల్ని వ్యర్థం చేసుకుంటున్నారు. డ్రగ్స్కు అడ్డుకట్టవేసేందుకు..ప్రభుత్వాలు, పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా..సరఫరాను మాత్రం ఆపలేకపోతున్నారు. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో మాదక ద్రవ్యాల ముఠాను అరెస్టు చేశారు పోలీసులు. అసోం నుంచి రూ.100 కోట్ల విలువైన హెరాయిన్ తరలిస్తుండగా చాకచక్యంగా ముగ్గురు నిందితులను పట్టుకున్నారు. వీరిని ఉత్తర్ప్రదేశ్ బారాబంకీకి చెందిన మహ్మద్ హషీమ్, సబ్బీర్, నరేశ్ కుమార్గా గుర్తించారు. మొదట 15 కిలోల […]
మత్తుమందు ఇప్పుడు దేశంలో ప్రధాన సమస్కల్లో ఒకటిగా మారింది. యువత వీటి భారిన పడి..జివితాల్ని వ్యర్థం చేసుకుంటున్నారు. డ్రగ్స్కు అడ్డుకట్టవేసేందుకు..ప్రభుత్వాలు, పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా..సరఫరాను మాత్రం ఆపలేకపోతున్నారు. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో మాదక ద్రవ్యాల ముఠాను అరెస్టు చేశారు పోలీసులు. అసోం నుంచి రూ.100 కోట్ల విలువైన హెరాయిన్ తరలిస్తుండగా చాకచక్యంగా ముగ్గురు నిందితులను పట్టుకున్నారు. వీరిని ఉత్తర్ప్రదేశ్ బారాబంకీకి చెందిన మహ్మద్ హషీమ్, సబ్బీర్, నరేశ్ కుమార్గా గుర్తించారు.
మొదట 15 కిలోల మాదక ద్రవ్యాన్ని పట్టుకున్నారు. తర్వాత కారును క్షుణ్ణంగా తనిఖీ చేయగా మరో 10 కిలోలు దొరికింది. ఈ ముఠాకు అసోంలోని బోకాజన్కు చెందిన వ్యక్తి సూత్రధారిగా తెలుస్తోంది. అతను మయన్మార్ నుంచి వస్తున్న హెరాయిన్ను ఇంపాల్కు చెందిన డీలర్ వద్ద కొనుగోలు చేస్తున్నట్లు తెలుసుకున్నారు. రెండేళ్లలో ఈ ముఠా సుమారు 200 కిలోల హెరాయిన్ను రాజధానికి తరలించింది. 2019లో ఢిల్లీ పోలీసు ప్రత్యేక విభాగం 10 పర్యాయాలు మాదకద్రవ్యాల తరలింపును అడ్డుకొంది. ఈ తనిఖీల్లో సుమారు 600 కిలోల హెరాయిన్ను స్వాధీనం చేసుకుంది.