Bihar Bulldozer: బీహార్‌లో కనిపించిన యోగి మోడల్ పాలన.. హంతకుడి ఇంట్లోకి దూసుకెళ్లిన సర్కార్ బుల్డోజర్!

|

Apr 04, 2022 | 12:32 PM

బీహార్‌లో నేరాలను అరికట్టడానికి బుల్‌డోజర్‌ను ఉపయోగించాలంటూ బీజేపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బుల్‌డోజర్ మోడల్ పరిపాలన ప్రభావం బీహార్‌లో కూడా కనిపిస్తుంది.

Bihar Bulldozer: బీహార్‌లో కనిపించిన యోగి మోడల్ పాలన.. హంతకుడి ఇంట్లోకి దూసుకెళ్లిన సర్కార్ బుల్డోజర్!
Bihar Bulldozer
Follow us on

Bihar Bulldozer: ప్రస్తుతం బీహార్‌లో కూడా యోగి మోడల్ పాలన గురించి చర్చ జరుగుతోంది. బీహార్‌లో నేరాలను అరికట్టడానికి బుల్‌డోజర్‌ను ఉపయోగించాలంటూ బీజేపీ(BJP) ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బుల్‌డోజర్ మోడల్ పరిపాలన ప్రభావం బీహార్‌లో కూడా కనిపిస్తుంది. వాస్తవానికి, బీహార్‌లోని చాప్రా(Chapra)లో ఆధిపత్య పోరులో ఇసుక వ్యాపారి సోనూ రాయ్ 25 మార్చి 2021న హత్యకు గురయ్యాడు. దీంతో కోపోద్రిక్తులైన ప్రజలు హింసాత్మక ఘటనలు సృష్టించారు. హత్య తర్వాత కాల్పులకు తెగబడ్డారు. హత్య అనంతరం మృతుడి తండ్రి సుదీష్ రాయ్ సహా ఈ కేసులో ఐదుగురిని నిందితులుగా చేర్చారు. ఈ ఐదుగురు నిందితుల్లో ఇద్దరు కోర్టులో లొంగిపోయారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. ఆ తర్వాత పరారీలో ఉన్న నిందితులు జితేంద్ర రాయ్, వికాస్ రాయ్ ఇంటిని అటాచ్ చేయాలని కోర్టు ఆదేశించింది. ఇప్పుడు ఈ నిందితులు హాజరుకాకపోవడంతో, జిల్లా యంత్రాంగం అటాచ్‌మెంట్‌ను స్వాధీనం చేసుకుంది. అంతేకాదు బుల్డోజర్లతో ఇంటిని నేలమట్టం చేశారు.

నిజానికి, హత్యకు గురైన ఇసుక వ్యాపారి సోనూరాయ్ సోదరుడిని ఏడాది క్రితం దుండగులు హతమార్చారు. మరో సారి సంవత్సరం తిరగకుండానే సోనూ రాయ్‌ను సైతం హతమార్చారు.హత్య కేసును ఉపసంహారించుకోవాలని తిరిగి ఇవ్వనందుకు నిందితులు తనను బెదిరించారని మృతుడి తండ్రి సుదీష్ రాయ్ ఆరోపించారు. లేదంటే తీవ్ర పరిణామాలు చవిచూస్తానని బెదిరించారని ఆయన పేర్కొన్నారు. ఆ తర్వాత రెండో కొడుకును కూడా చంపేశారు. అన్నదమ్ములిద్దరి హత్య తర్వాత ఆ కుటుంబం దిక్కులేనిదైంది. నిజానికి ఈ మొత్తం ఎపిసోడ్ ఇసుక వ్యాపారంలో ఆధిపత్యానికి సంబంధించి జరిగింది. ఆ తర్వాత పోలీసులు హత్యా నిందితుల ఇంటిని జప్తు చేసి బుల్‌డోజర్‌తో కూల్చివేశారు.

హత్య నిందితుల ఇంటికి బుల్‌డోజర్‌ వెళ్లడంతో ఇక్కడ రాజకీయ రగడ మొదలైంది. చాప్రాలోనే సుమారు రెండు కోట్లు దోపిడికి గురైన దుకాణదారుడిని కలిసేందుకు వచ్చిన ఉపముఖ్యమంత్రి తార్ కిషోర్ ప్రసాద్.. బీహార్‌లో బుల్‌డోజర్‌ మోడల్‌ అవసరమని చెప్పగా.. బీహార్‌లో యోగి జీ బుల్‌డోజర్‌ మోడల్‌ అవసరమని చెప్పారు. దీంతో పాటు చాప్రాలో తీసుకున్న ఈ చర్యపై బీజేపీ నేత, నితీష్ ప్రభుత్వంలోని మంత్రి సామ్రాట్ చౌదరి మాట్లాడుతూ.. కోర్టు ఆదేశాల మేరకే ఈ చర్య తీసుకున్నట్లు చెప్పారు. అక్రమంగా స్వాధీనం చేసుకున్న వారి ఇంట్లో బుల్డోజర్ ఉంటుందని సామ్రాట్ చౌదరి తెలిపారు. మరోవైపు, బీహార్‌లో యోగి మోడల్ అవసరమని రబ్రీ దేవి ఎగతాళి చేసి, యోగి ఆదిత్యనాథ్‌ను బీహార్ ముఖ్యమంత్రిని చేయాలని డిమాండ్ చేశారు.

Read Also….   Pakistan Crisis: పాకిస్థాన్ తాత్కాలిక ప్రధానిగా జస్టిస్ ఆర్ అజ్మత్ సయీద్.. ప్రతిపాదించిన ఇమ్రాన్ ఖాన్ పార్టీ!