జీవాతో కలిసి ధోని బైక్ రైడ్.. అంతా లైవ్‌లో..

|

Jun 03, 2020 | 12:35 PM

ధోనికి బైక్ రైడింగ్ అంటే ఎంత ఇష్టమో చాలా సార్లు సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. రాంచీ గల్లీల్లో ఫ్రెండ్స్‌తో కలిసి చక్కర్లు కొట్టడం.. లాంగ్ డ్రైవింగ్ చేయటం అంటే ఎంతో ఇష్టమో చాలా ఇంటర్య్వూల్లో చెప్పారు. ఇక ఇప్పుడు ఇలా...

జీవాతో కలిసి ధోని బైక్ రైడ్.. అంతా లైవ్‌లో..
Follow us on

టీమిండియా మాజీ కూల్ కెప్టెన్ ఎంఎస్ ధోని మరోసారి తన కూతురు జీవాతో కలిసి బైక్‌పై తిరుగుతూ సందడి చేశారు. లాక్‌డౌన్ కొనసాగుతున్న సమయంలో ఇంటికే పరిమితమైన ధోని… రాంచీలోని తన ఫామ్‌హౌస్‌లో తన ఫ్యామిలీతో కలిసి తెగ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే తాజాగా చిన్నారి జీవాతో కలిసి ఫామ్‌హౌస్‌లోనే రౌండ్లు కొడుతూ కనిపించారు. ఇదంతా ధోని సతీమణి సాక్షి ఇన్‌స్టాగ్రమ్‌లో లైవ్ సేషన్ చేస్తుండగానే ధోని అక్కడికి వచ్చారు. అమ్మ పక్కనే ఉన్న జీవాని బైక్‌పై ముందు కూర్చోబెట్టుకుని తీసుకెళ్లారు. ఫామ్‌హౌస్‌లో తిరగడం అంతా లైవ్‌లో కనిపించింది. ఈ వీడియోను ఐపీఎల్ ఫ్రాంచైజీ చెన్నై సుపర్ కింగ్స్ తమ ఇన్‌స్టాలో షేర్ చేశారు.

అయితే ధోనికి బైక్ రైడింగ్ అంటే ఎంత ఇష్టమైన.. చాలా సార్లు సోషల్ మీడియాలో షేర్ చేశారు. గతంలో రాంచీ గల్లీల్లో ఫ్రెండ్స్‌తో కలిసి చక్కర్లు కొట్టడం.. లాంగ్ డ్రైవింగ్ చేయటం అంటే ఎంతో ఇష్టమో చాలా ఇంటర్య్వూల్లో చెప్పారు. ఇక ఇలా ఫామ్‌హౌస్‌లో జీవా, ధోనిలు బైక్‌పై చక్కర్లు కొట్టడం ఇదే తొలి సారి కాదు. గతంలో కూడా వీరిద్దరు బైక్‌పై తిరుగుతున్న వీడియోను సాక్షి తన ఇన్‌స్టాలో అభిమానులతో పంచుకున్న సంగతి తెలిసిందే.