UK News: బ్రిటన్లో క్రిస్మస్పై ఆంక్షలు ఉండవు..! పీఎం బోరిస్ జాన్సన్ ఏం చెప్పాడంటే..?
UK News: క్రిస్మస్కు ముందు కఠినమైన కోవిడ్-19 నిబంధనలను అమలు చేయడాన్ని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తిరస్కరించారు. బ్రిటన్
UK News: క్రిస్మస్కు ముందు కఠినమైన కోవిడ్-19 నిబంధనలను అమలు చేయడాన్ని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తిరస్కరించారు. బ్రిటన్ ప్రజలు వరుసగా రెండో ఏడాది కూడా ఆంక్షల మధ్య క్రిస్మస్ వేడుకలు జరుపుకోవాల్సి వస్తుందని ఊహాగానాలు రావడంతో ప్రధాని స్పందించారు. అనంతరం వీడియో ప్రసంగంలో ప్రజలందరు జాగ్రత్తగా ఉండాలని కోరారు. పరిస్థితి అదుపులోనే ఉందని, డిసెంబర్ 25 తర్వాత మంత్రులు మరిన్ని ఆంక్షలను ప్రకటించవచ్చని పేర్కొన్నారు.
బోరిస్ జాన్సన్ మాట్లాడుతూ.. క్రిస్మస్కు ముందు కఠిన ఆంక్షలను అమలు చేయాలనుకోవడం లేదని పరిస్థితి అదుపులోనే ఉందని చెప్పారు. ఓమిక్రాన్ను పర్యవేక్షిస్తూనే ఉంటామని, పరిస్థితి మరింత దిగజారితే, అవసరమైన విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. తాను కొత్త ఆంక్షలను ఇంకా ప్లాన్ చేయలేదని క్యాబినెట్ సమావేశం తర్వాత చెప్పారు. కానీ డిసెంబర్ 25 లోపు ఆంక్షలు ప్రవేశపెట్టే అవకాశం లేదన్నారు. దీని కారణంగా లక్షలాది మంది ప్రజలు క్రిస్మస్ వేడుకలు నిర్వహించుకోవచ్చని సంబరపడుతున్నారు. ఆర్థిక మంత్రి రిషి సునక్తో సహా అతని క్యాబినెట్ సభ్యులు ఓమిక్రాన్ తీవ్రత గురించి మరింత డేటాను పరిశీలించాలనుకుంటున్నారు. తద్వారా ఆర్థిక వ్యవస్థపై నిర్ణయం తీసుకోవచ్చని అంచనా వేస్తున్నారు.
మరోవైపు UK ప్రభుత్వం Omicron వేరియంట్ ద్వారా ప్రభావితమైన హోటల్లు, రెస్టారెంట్లు, ఇతర సంబంధిత ప్రాంతాలకు వన్ బిలియన్ పౌండ్ల సహాయాన్ని అందిస్తుంది. పబ్లు, రెస్టారెంట్లు, ఇతర సంబంధిత వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ ప్రకటన చేసింది. కరోనా వైరస్ కారణంగా ప్రభుత్వం నిబంధనలు విధించడంతో హోటల్, రెస్టారెంట్ పరిశ్రమ నష్టాలలోకి వెళ్లాయి. UK ఆర్థిక మంత్రి రిషి సునక్ హోటల్లు, వినోద సంబంధిత పరిశ్రమలకు £1 బిలియన్ ప్యాకేజీని ప్రకటించారు.