కరోనా వైరస్: సొంతూరి కోసం లెక్కల మాస్టార్ ఉదార భావం..!

| Edited By:

Mar 28, 2020 | 8:35 PM

ప్రపంచవ్యాప్తంగా కరోనా విస్తరణ రోజు రోజుకు పెరుగుతోంది. ఇప్పటికే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6లక్షలను దాటేయగా.. చనిపోయిన వారి సంఖ్య 28వేలను దాటేసింది. ఈ వ్యాధి ఆటకట్టించేందుకు ప్రపంచదేశాలన్నీ తమ శాయశక్తులా పోరాడుతున్నాయి. ఇటు దేశంలోనూ కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రధాని మోదీ లాక్ డౌన్ ప్రకటించారు. మరోవైపు కరోనాపై ఇటు రాష్ట్ర, అటు కేంద్ర ప్రభుత్వాలు చేస్తోన్న యుద్ధానికి పలువురు తమ వంతు సాయం ప్రకటిస్తున్నారు. […]

కరోనా వైరస్: సొంతూరి కోసం లెక్కల మాస్టార్ ఉదార భావం..!
Follow us on

ప్రపంచవ్యాప్తంగా కరోనా విస్తరణ రోజు రోజుకు పెరుగుతోంది. ఇప్పటికే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6లక్షలను దాటేయగా.. చనిపోయిన వారి సంఖ్య 28వేలను దాటేసింది. ఈ వ్యాధి ఆటకట్టించేందుకు ప్రపంచదేశాలన్నీ తమ శాయశక్తులా పోరాడుతున్నాయి. ఇటు దేశంలోనూ కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రధాని మోదీ లాక్ డౌన్ ప్రకటించారు. మరోవైపు కరోనాపై ఇటు రాష్ట్ర, అటు కేంద్ర ప్రభుత్వాలు చేస్తోన్న యుద్ధానికి పలువురు తమ వంతు సాయం ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ టాప్ దర్శకుడు సుకుమార్ ఇప్పటికే ఇరు తెలుగు రాష్ట్రాలకు చెరో రూ.5 లక్ష రూపాయలు ప్రకటించారు. అయితే అంతటితో ఆయన ఆగలేదు. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలోని తన సొంతూరు మట్టపర్రు గ్రామానికి ఆయన రూ.5లక్షలు అందజేశారు. తన కుటుంబ సభ్యుల ద్వారా తన గ్రామంలో రేషన్ కార్డులు ఉన్న ప్రతి ఒక్కరికీ వెయ్యి రూపాయల చొప్పున పంపిణీ చేయించారు. ఈ సందర్బంగా కరోనా వైరస్ బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.

Read This Story Also: Breaking: తెలంగాణలో తొలి కరోనా మరణం..!