మూవీ ప్రియులకు శుభవార్తే..లాక్ డౌన్ కారణంగా మార్చ్ 25 నుంచి మూతపడిన సినిమా హాల్స్ తెరుచుకోనున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో సినిహాల్స్, షాపింగ్ మాల్స్ వంటివి మూసివేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు, జనసమూహంగా ఎక్కువగా గుమిగూడే ఏరియాల్లో లాక్డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నారు. అయితే, వైరస్ వ్యాప్తి తీవ్రతను బట్టి మూడు జోన్లుగా విభజించారు. రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా విభజించారు. రెడ్ జోన్ పరిధిలో కఠిన నిబంధలు అమలు చేస్తూ…ఆరెంజ్ జోన్లో కొంత మేర సడలింపు నిచ్చింది ప్రభుత్వం. ఈ మేరకు కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టిందని నిర్ధారించుకున్న గ్రీన్ జోన్లలో కార్యకలాపాలను మెల్లిమెల్లిగా ప్రారంభిస్తున్నారు. అందులో భాగంగానే… ఈ నెల 18వ తేది నుంచి సినిమా థియేటర్లకు కూడా అనుమతించే అవకాశం ఉందంటున్నారు.