2020ని కాలితో తంతానంటోన్న క్రికెటర్..

| Edited By:

Jul 14, 2020 | 1:34 PM

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి టెర్రర్ సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. రోజుకూ లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కూడా ఏదో రూపంలో ఎటాక్ చేస్తూనే ఉంది కరోనా. సామాన్యులతో పాటు వైద్యులు, పోలీసులు, నటులు, రాజకీయ నాయకులు సైతం కరోనా బారిన పడుతుండటంతో..

2020ని కాలితో తంతానంటోన్న క్రికెటర్..
Follow us on

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి టెర్రర్ సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. రోజుకూ లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కూడా ఏదో రూపంలో ఎటాక్ చేస్తూనే ఉంది కరోనా. సామాన్యులతో పాటు వైద్యులు, పోలీసులు, నటులు, రాజకీయ నాయకులు సైతం కరోనా బారిన పడుతుండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందులోనూ 2020లో అనుకోని ప్రమాదాలు కూడా జరుగుతూనే ఉన్నాయి. దీంతో 2020 సంవత్సరాన్ని కాలితో తంతానని అంటున్నాడు టీమిండియా మాజీ పేసర్ ఇర్ఫాన్ పఠాన్. 2020 ఏడాదిని ఉద్ధేశిస్తూ ఓ ఫొటోను కూడా ట్విట్టర్లో పోస్ట్ చేశాడు.

‘ఫొటోలో లెగ్ కిక్ ఫోజులో పెట్టి కనిపించాడు ఇర్ఫాన్. ఈ సంవత్సరంలో సగం అయిపోయింది. కానీ నాకు మాత్రం 2020ని ఇలా తన్నాలని ఉంది’ అంటూ ట్వీట్ చేశాడు. దీంతో ఈ పోస్ట్‌పై నెటిజన్లు కూడా రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

కాగా 2020 ప్రారంభం నుంచే కరోనా సహా ఇతర విపత్తులతో ప్రపంచం విలవిలలాడుతోంది. కరోనా మహమ్మారితో పాటు భూకంపాలు, తుఫానులు, మిడతల దాడులు వంటివి ఎదుర్కొంది భారత్.