తమిళనాడులో రెండున్నర లక్షలకు చేరిన కరోనా కేసులు

తమిళనాడులో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రెండున్నర లక్షలుకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా గడిచిన..

తమిళనాడులో రెండున్నర లక్షలకు చేరిన కరోనా కేసులు

Updated on: Aug 01, 2020 | 10:27 PM

తమిళనాడులో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రెండున్నర లక్షలుకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 5,879 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,51,738కి చేరింది. వీటిలో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని 1,90,966 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 60,580 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ విషయాన్ని తమిళనాడు రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక కరోనా బారినపడి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 4,034 మంది మరణించారు.

Read More

ముందు ఉల్లి బస్తాలు.. వెనుక గంజాయి బస్తాలు

రాజౌరీ సెక్టార్‌లో పాక్‌ కాల్పులు.. జవాన్‌ వీరమరణం

ఢిల్లీలో కేసుల కంటే పెరిగిన రికవరీలు

Loading...
Unable to load recommendations.
Follow Us