రేపటి నుంచి తెరుచుకోనున్న రిజిస్ట్రార్ కార్యాలయాలు

| Edited By: Pardhasaradhi Peri

May 04, 2020 | 9:56 PM

రిజిస్ట్రార్ ఆఫీస్‌కు వచ్చే ఉద్యోగులతో పాటు రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే వారికి కూడా వర్తిస్తాయని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. అలాగే రిజిస్ట్రార్ ఆఫీసుకు వచ్చే వారు కూడా తప్పనిసరిగా మాస్క్‌లు ధరించి, సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ..

రేపటి నుంచి తెరుచుకోనున్న రిజిస్ట్రార్ కార్యాలయాలు
Follow us on

కరోనా వైరస్ విజృంభిస్తోన్న కారణంగా దేశ వ్యాప్తంగా అన్ని ప్రభుత్వాలూ లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే కదా. దీంతో అన్నీ ఒక్కసారిగా బంద్ అయిపోయాయి. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలమేరకు గ్రీన్, ఆరెంజ్ జోన్లలో అన్ని రకాల కార్యకలాపాలు చేసుకోవచ్చని తెలిపాయి ప్రభుత్వాలు. దీంతో లాక్‌డౌన్ కారణంగా మూత పడిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను సడలింపుల్లో భాగంగా రేపటి నుంచి తెరవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే మద్యం దుకాణాలను తెరిచిన ప్రభుత్వం.. కేంద్ర మార్గదర్శకాల మేరకు రెడ్ జోన్ల బయట సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు తెరిచేందుకు ఆదేశాలు ఇచ్చింది. గత నెలన్నర కారణంగా ఆదాయాలు కోల్పోయిన ప్రభుత్వాలు.. రిజిస్ట్రేషన్లకు అనుమతివ్వడం ద్వారా తిరిగి ఆదాయాన్ని రాబట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది.

ఈ నేపథ్యంలో రిజిస్ట్రార్ ఆఫీస్‌కు వచ్చే ఉద్యోగులతో పాటు రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే వారికి కూడా వర్తిస్తాయని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. అలాగే రిజిస్ట్రార్ ఆఫీసుకు వచ్చే వారు కూడా తప్పనిసరిగా మాస్క్‌లు ధరించి, సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ కార్యకలాపాలు కొనసాగించాలని ఆశించింది. రిజిస్ట్రేషన్ కోసం ముందుగా వచ్చేవారికి అనుమతి ఇవ్వాలని రిజిస్ట్రార్లకు సూచించింది. అలాగే ఉద్యోగుల హాజరు కోసం వాడే బయోమెట్రిక్ యంత్రాలను రోజూ శానిటైజ్‌తో శుభ్రం చేయాలని సూచించింది ప్రభుత్వం. ఆఫీసులో పదిమందికి ఎక్కువగా ఉండకూడదని ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం.

Read More:

షాపుల ముందు మందు బాబుల క్యూ లైన్‌ చూసి షాక్‌ అయిన చంద్రబాబు!

పేగులపై కరోనా వైరస్ దాడి.. మళ్లీ ఇదో కొత్త టెన్షన్!

నేనూ లైంగిక వేధింపులు ఎదుర్కొన్నా: ఆయుష్మాన్