సౌరభ్ గంగూలీకి కరోనా పరీక్షలు.. రిపోర్టులో తేలింది ఇదే..!

| Edited By:

Jul 25, 2020 | 8:25 PM

బీసీసీఐ ప్రెసిడెంట్‌, భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్ సౌర‌భ్ గంగూలీ కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఆయన సోదరుడు స్నేహాశిశ్‌ గంగూలీకి ఇటీవల కరోనా పాజిటివ్‌గా తేలడంతో.. దాదా కూడా క్వారంటైన్‌లోకి..

సౌరభ్ గంగూలీకి కరోనా పరీక్షలు.. రిపోర్టులో తేలింది ఇదే..!
Follow us on

బీసీసీఐ ప్రెసిడెంట్‌, భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్ సౌర‌భ్ గంగూలీ కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఆయన సోదరుడు స్నేహాశిశ్‌ గంగూలీకి ఇటీవల కరోనా పాజిటివ్‌గా తేలడంతో.. దాదా కూడా క్వారంటైన్‌లోకి వెళ్లిపోయాడు. అయితే ముందస్తు జాగ్రత్తగా కరోనా పరీక్షలు చేయించుకోగా.. రిపోర్టులో నెగెటివ్‌గా తేలింది. దాదాపు పది రోజులుగా సౌరభ్‌ హోం క్వారంటైన్‌లోనే ఉంటున్నారు. సౌరభ్ గత కొద్ది రోజులుగా సోదరుడితో కలిసి ఉంటున్నాడు. ఆయన సోదరుడు స్నేహాశిశ్ గంగూలీ.. క్రికెట్ అసోసియేష‌న్ ఆఫ్ బెంగాల్ సెక్రెట‌రీగా ప‌నిచేస్తున్నారు.

ఇక ఆయన సోదరుడు కూడా ప్రస్తుతం కరోనా నుంచి కోలుకుంటున్నారని.. మరో రెండు మూడు రోజుల్లో పూర్తిగా కరోనాను జయించి డిశ్చార్జ్ అవుతారని వైద్యులు తెలిపారు.