ఈ నెల 3 నుంచి ఉచిత రేషన్ పంపిణీకి రంగం సిద్ధమైంది. రేషను కార్డు ఉన్నటువంటి కుటుంబాలకు ఈ నెలలో కూడా ఉచితంగా రేషన్ పంపిణీ చేయనున్నట్లు ఏపీ పౌరసరఫరాల సంస్థ అధికారులు తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కుటుంబానికి కిలో కందిపప్పు, కుటుంబ సభ్యునికి 5కిలోల చొప్పున బియ్యం ఇవ్వనున్నారు.
అరకిలో పంచదార మాత్రం రూ.17కు ఇవ్వనున్నారు. పీఎం గరీభ్ కల్యాణ్ యోజన పథకంలో భాగంగా జులై నెల రేషన్ ఉచితంగా పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. అన్ లాక్ ప్రక్రియ కొనసాగుతున్నందున కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఉచితంగా రేషన్ అందించాలని ఆదేశించింది. రేషన్ కార్డు ఉన్నవారు సమీపంలోని రేషన్ షాపులో తీసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం సూచించింది.