ఒడిషాలో 28 వేల మార్క్‌ను దాటిన కరోనా కేసులు

| Edited By:

Jul 28, 2020 | 4:11 PM

ఒడిషాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. గత కొద్ది రోజులుగా నిత్యం వెయ్యికి పైగానే కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో స్థానిక ప్రజలు..

ఒడిషాలో 28 వేల మార్క్‌ను దాటిన కరోనా కేసులు
Follow us on

ఒడిషాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. గత కొద్ది రోజులుగా నిత్యం వెయ్యికి పైగానే కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో స్థానిక ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 1,215 కరోన పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి
వరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 28,107కి చేరింది. ఈ విషయాన్ని ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇక ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని 17,374 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 10,544 యాక్టివ్ కేసులు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఇక కరోనా బారినపడి ఇప్పటి వరకు రాష్ట్రంలో 154 మంది
మరణించారు.

కాగా, దేశ వ్యాప్తంగా కరోనా కేసులు రోజుకు అరలక్షకు చేరువలో నమోదవుతున్నాయి. ఇప్పటికే పద్నాలుగు లక్షలు దాటి.. పదిహేను లక్షలకు చేరువయ్యాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.