
ఢిల్లీకి సమీపంలోని గౌతమ్ బుధ్ద నగర్లో 632 కరోనా వైరస్ కేసులు ఉన్నాయి. వీటిలో 195 యాక్టివ్ కేసులు. అయితే కరోనా నుంచి 60 మంది రోగులు కోలుకున్నారు. వీరిలో 94 ఏళ్ళ వృధ్ధుడు కూడా ఉన్నారు. ఇందుకు గౌతమ్ బుధ్ద నగర్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ సుహాస్.. ఆయనను అభినందిస్తూ.. ‘సర్ ! మేము మరింత హార్డ్ వర్క్ చేసేందుకు మమ్మల్ని మోటివేట్ చేశారు’.. అంటూ ట్వీట్ చేశారు. ఇక్కడి ఓ ప్రైవేటు హాస్పిటల్ నుంచి నిన్న పదిమంది డిశ్చార్జ్ అయిన వారిలో ఈ 94 వృధ్ధుడు కూడా ఉన్నారు.
This 94 year resident turned covid negative and was discharged today. He is an inspiration to many like me. Sir, you motivate us to work even harder, we all residents wish you a very long and healthy life ? pic.twitter.com/WpaKITKDjo
— DM G.B. Nagar (@dmgbnagar) June 7, 2020