త్వరలోనే మాల్స్, సెలూన్స్ ఓపెన్.. అయితే.!

|

May 14, 2020 | 8:55 AM

త్వరలోనే మాల్స్, సెలూన్స్, బ్యూటీ పార్లర్లను ఓపెన్ చేసేందుకు అనుమతి ఇచ్చే అవకాశముందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. అయితే అందరూ కూడా కొన్ని గైడ్‌లైన్స్ తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందన్నారు. జనసాంద్రత ఎక్కువగా ఉండే మాల్స్, సెలూన్స్, బ్యూటీ పార్లర్లను మార్చి 25 నుంచి దేశవ్యాప్తంగా మూసి వేసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే పలు రాష్ట్రాలు కొన్ని పరిమితులతో బార్బర్ షాపులు తెరిచేందుకు అనుమతులు ఇచ్చాయి. తొందరలోనే బ్యూటీ పార్లర్లు, సెలూన్స్, మాల్స్ ఓపెన్ […]

త్వరలోనే మాల్స్, సెలూన్స్ ఓపెన్.. అయితే.!
Follow us on

త్వరలోనే మాల్స్, సెలూన్స్, బ్యూటీ పార్లర్లను ఓపెన్ చేసేందుకు అనుమతి ఇచ్చే అవకాశముందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. అయితే అందరూ కూడా కొన్ని గైడ్‌లైన్స్ తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందన్నారు. జనసాంద్రత ఎక్కువగా ఉండే మాల్స్, సెలూన్స్, బ్యూటీ పార్లర్లను మార్చి 25 నుంచి దేశవ్యాప్తంగా మూసి వేసిన సంగతి తెలిసిందే.

ఇక ఇప్పటికే పలు రాష్ట్రాలు కొన్ని పరిమితులతో బార్బర్ షాపులు తెరిచేందుకు అనుమతులు ఇచ్చాయి. తొందరలోనే బ్యూటీ పార్లర్లు, సెలూన్స్, మాల్స్ ఓపెన్ అవుతాయని.. కానీ కొన్ని గైడ్‌లైన్స్ పాటించాల్సిన అవసరం ఉంటుందని తాజాగా మీడియా సమావేశంలో నితిన్ గడ్కరీ అన్నారు. మనం కరోనాతో జీవించాల్సిన అవసరం ఉందన్న ఆయన.. మాస్క్‌ను ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడం, ఇంట్లో లేదా ఆఫీసులోకి అడుగుపెట్టేటప్పుడు ప్రతీసారి శానిటైజర్ ఉపయోగించడం వంటివి మన జీవితంలో భాగం అవ్వాలని తెలిపారు.

మరోవైపు లాక్ డౌన్ 4.0 గురించి ప్రస్తావించిన గడ్కరీ.. సరికొత్త రూల్స్‌తో.. డిఫరెంట్‌గా ఉండబోతుందని వివరించారు. మే 18లోపే లాక్ డౌన్ 4.0 మార్గదర్శకాలను వెల్లడిస్తామని స్పష్టం చేశారు. కాగా, ప్రధాని నాలుగోదశ లాక్ డౌన్ ప్రకటించిన తర్వాత రోజే మాల్స్, సెలూన్స్ విషయాన్ని కేంద్రమంత్రి ప్రస్తావించడంతో వాటికీ ఈ లాక్ డౌన్‌లో మినహాయింపు ఉంటుందని అందరూ భావిస్తున్నారు.

Read This: హైదరాబాద్‌లో ఉన్నవాళ్లు సొంతూళ్లకు రావొచ్చు.. కానీ