మహారాష్ట్రలో సేమ్ సీన్ రిపీట్..!

| Edited By:

Jul 26, 2020 | 9:02 PM

మహారాష్ట్రలో కరోనా విలయ తాండవం చేస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య వేలల్లో నమోదవుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 9,431 కరోనా పాజిటివవ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు..

మహారాష్ట్రలో సేమ్ సీన్ రిపీట్..!
Follow us on

మహారాష్ట్రలో కరోనా విలయ తాండవం చేస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య వేలల్లో నమోదవుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 9,431 కరోనా పాజిటివవ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,75,799కి చేరింది. ఇక ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని 2,13,238 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,48,601 యాక్టివ్ కేసులు న్నాయి. ఈ విషయాన్ని మహారాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల్లో అత్యధికంగా ముంబై నగరంలోనే నమోదవుతున్నాయి. ఇకర ధారవిలో పూర్తిగా అదుపులోకి వచ్చిందనుకున్న వేళ.. మళ్లీ రోజుకు ఒకటో రెండో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా ఆదివారం నాడు కొత్తగా మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఇక్కడ 113 యాక్టివ్ కేసులు ఉన్నాయి.