గుడ్‌న్యూస్‌.. మార్కెట్‌లోకి కరోనా టాబ్లెట్లు.. మరింత చౌక ధరలకే..!

| Edited By:

Aug 06, 2020 | 6:08 AM

కరోనా మహమ్మారితో యావత్‌ ప్రపంచ దేశాలు యుద్ధం చేస్తున్నాయి. ఈ మహమ్మారికి వ్యాక్సిన్‌ లేకపోవడంతో.. ఇది రోజురోజుకు విజృంభిస్తోంది. ఈ వైరస్‌ సోకిన వారికి చికిత్సలో భాగంగా ఒక్కో దేశం ఒక్కో..

గుడ్‌న్యూస్‌.. మార్కెట్‌లోకి కరోనా టాబ్లెట్లు.. మరింత చౌక ధరలకే..!
Follow us on

కరోనా మహమ్మారితో యావత్‌ ప్రపంచ దేశాలు యుద్ధం చేస్తున్నాయి. ఈ మహమ్మారికి వ్యాక్సిన్‌ లేకపోవడంతో.. ఇది రోజురోజుకు విజృంభిస్తోంది. ఈ వైరస్‌ సోకిన వారికి చికిత్సలో భాగంగా ఒక్కో దేశం ఒక్కో ఫార్ములాను ఉపయోగిస్తూ.. పలు మెడిసిన్స్‌ను కూడా వాడుతున్నాయి. అందులో రెమ్డిసివేర్‌ ఇంజక్షన్‌తో పాటు.. ఫావిపిరవిర్ ట్యాబ్లెట్లను కూడా ఉపయోగిస్తున్నారు. వైరస్ లక్షణాలు సాధారణంగా ఉండి.. ప్రారంభ దశలో.. ఈ ఫావిపిరవిర్ ట్యాబ్లెట్లను ఉపయోగించడం ద్వారా.. పది రోజుల్లో పూర్తిగా కోలుకుంటున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు.. వైద్యులు కూడా ఈ మెడిసిన్‌ను సూచిస్తున్నారు. అయితే తొలుత ఈ ట్యాబ్లెట్‌ ధర రూ.103/- గా ఉంది. ఆ తర్వాత మార్కెట్‌లో పోటీ పెరగడంతో పాటు.. ఉత్పత్తి కూడా ఎక్కువ అవ్వడంతో క్రమక్రమంగా దీని ధర తగ్గుతూ వస్తోంది. తాజాగా.. కరోనా యాంటీ వైరల్ డ్రగ్ ఫావిపిరవిర్‌ను మంగళశారం మార్కెట్లోకి ప్రవేశపెట్టాయి లుపిన్‌, బీడీఆర్‌ ఫార్మా సంస్థలు. కొవిహాల్ట్‌ పేరుతో లుపిన్‌ ఈ ట్యాబ్లెట్‌ను ప్రవేశపెట్టింది. దీని ధర ఒక్కో ట్యాబ్లెట్‌కు రూ.49/- గా నిర్ణయించారు..

200 ఎంజీతో 10 ట్యాబ్లెట్లతో స్ట్రిప్స్ ను మార్కెట్లోకి విడుదల చేస్తున్నామని సంస్థ అధికారులు తెలిపారు. ఇక బీడీఫవి పేరుతో బీడీఆర్‌ ఫార్మా కూడా ట్యాబ్లెట్‌ను మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. ఈ బీడీఫవి ఒక్కో టాబ్లెట్‌ ధర రూ.63గా ఉంది. ఇక సన్‌ ఫార్మా కూడా ‘ఫ్లూగార్డ్‌’పేరుతో సోమవారం నాడు ఫావిపిరవిర్‌ టాబ్లెట్లను విడుదల చేసింది. దీని ఒక్కో ట్యాబ్లెట్‌ ధర రూ.35గా ఉంటుందని అధికారులు తెలిపారు.

Read More :

ఏపీలో కరోనా విలయం.. మళ్లీ 10 వేలకు పైగానే కేసులు

సరిహద్దు భద్రతలో మహిళా జవాన్లు

పూంచ్‌ జిల్లా సరిహద్దుల్లో కాల్పులకు దిగిన పాక్‌