కరోనా ఉధృతి.. 6 నగరాల నుంచి విమానాలకు బెంగాల్ నో ఎంట్రీ

| Edited By: Pardhasaradhi Peri

Jul 04, 2020 | 7:42 PM

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కోల్ కతా విమానాశ్రయం తాజా నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ, ముంబై, పూణే, నాగపూర్, చెన్నై, అహమ్మదాబాద్ నగరాల నుంచి తాము సిటీలోకి విమానాలను..

కరోనా ఉధృతి.. 6 నగరాల నుంచి విమానాలకు బెంగాల్ నో ఎంట్రీ
Follow us on

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కోల్ కతా విమానాశ్రయం తాజా నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ, ముంబై, పూణే, నాగపూర్, చెన్నై, అహమ్మదాబాద్ నగరాల నుంచి తాము సిటీలోకి విమానాలను అనుమతించబోమని ప్రకటించింది. తదుపరి ఉత్తర్వులు వచ్ఛేవరకు ఈ ఆదేశాలు  ఈ నెల 6 నుంచి 19 వరకు అమలులో ఉంటాయని పేర్కొంది. కోవిడ్-19 హాట్ స్పాట్ ప్రాంతాల నుంచి విమానాలను నిలిపివేయాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కేంద్రాన్ని కోరడంతో కోల్ కతా విమానాశ్రయ అధికారులు తామే ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. అయితే కోల్ కతా నుంచి బయల్దేరే విమానాలకు ఈ బ్యాన్ వర్తించబోదు. దేశంలో ఇప్పటివరకు 6.48 లక్షల మంది కరోనా వైరస్ కి గురయ్యారు. 18,500  మంది కరోనా రోగులు మరణించారు.