కర్నాటకలో విజృంభిస్తోన్న కరోనా.. తాజాగా మరో 3,176 కేసులు..

కర్నాటకలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు వేలల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. తాజాగా బుధవారం నాడు కొత్తగా మరో 3,176 కరోనా..

కర్నాటకలో విజృంభిస్తోన్న కరోనా.. తాజాగా మరో 3,176 కేసులు..

Edited By:

Updated on: Jul 15, 2020 | 11:06 PM

కర్నాటకలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు వేలల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. తాజాగా బుధవారం నాడు కొత్తగా మరో 3,176 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 47,253కి చేరింది. ఇక రాష్ట్రంలో నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా బెంగళూరు నగరంలోనే నమోదవుతున్నాయి. బుధవారం నాడు బెంగళూరు నగరంలోనే 1,975 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా అన్‌లాక్‌ 1.0 తర్వాత కర్ణాటక రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ విషయాన్ని కర్ణాటక రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 27,853 యాక్టివ్ కేసులు ఉన్నాయని అధికారులు తెలిపారు.