చైనాపై సీరియస్ అవుతూనే.. “కరోనా”కు టిప్స్ చెప్పిన కేఏ పాల్..!

| Edited By:

Mar 23, 2020 | 8:31 PM

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ చైనా ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. కరోనా గురించి ముందే చెప్పకపోవడంతో.. ఈ విపత్కర పరిస్థితులు వచ్చాయన్నారు. అమెరికాలో ఉన్న ఆయన.. తన ఫేస్‌బుక్ ద్వారా లైవ్‌లోకి వచ్చి మాట్లాడారు. ఈ క్రమంలో చైనాపై అనేక ఆరోపణలు గుప్పించారు. అక్కడ కోటి మందికి పైగా వైరస్ బారిన పడినట్లు రిపోర్టులు వస్తున్నాయని.. లక్షల మంది వరకు చనిపోయి ఉంటారని అనుమానాలను వ్యక్తం చేశారు. చిన్న దేశమైన ఇటలీలోనే ఐదు వేల మంది […]

చైనాపై సీరియస్ అవుతూనే.. కరోనాకు టిప్స్ చెప్పిన కేఏ పాల్..!
Follow us on

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ చైనా ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. కరోనా గురించి ముందే చెప్పకపోవడంతో.. ఈ విపత్కర పరిస్థితులు వచ్చాయన్నారు. అమెరికాలో ఉన్న ఆయన.. తన ఫేస్‌బుక్ ద్వారా లైవ్‌లోకి వచ్చి మాట్లాడారు. ఈ క్రమంలో చైనాపై అనేక ఆరోపణలు గుప్పించారు. అక్కడ కోటి మందికి పైగా వైరస్ బారిన పడినట్లు రిపోర్టులు వస్తున్నాయని.. లక్షల మంది వరకు చనిపోయి ఉంటారని అనుమానాలను వ్యక్తం చేశారు. చిన్న దేశమైన ఇటలీలోనే ఐదు వేల మంది చనిపోయారని.. యూరప్ దేశాల్లో అనేక మంది ఈ వైరస్ బారినపడ్డారన్నారు. చైనా ప్రభుత్వం కరోనా మృతుల విషయంపై స్పష్టమైన సమాచారాన్ని దాస్తోందని ఆరోపించారు. కరోనాకు ఇప్పటి వరకు ఏ దేశం కూడా మందు కనిపెట్టలేదని తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే ఆదేశాలను తప్పకుండా పాటించాలన్నారు. స్వీయ నియంత్రణతో పాటు.. నిత్యం శుభత్రను పాటించాలని సూచించారు.

కాగా.. కరోనా మరణమృదంగం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా దీని బారినపడి 15 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.