భారతావనిపై కరోనా ఉక్కు పిడికిలి…

కరోనా వైరస్‌ భారతావనిపై తన ఉక్కు పిడికిలిని క్రమంగా బిగిస్తోంది. దేశంలో తాజాగా 24 గంటల్లో రికార్డు స్థాయిలో ఏకంగా 6,767 మంది వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యారు.

భారతావనిపై కరోనా ఉక్కు పిడికిలి...

Updated on: May 25, 2020 | 1:01 PM

కరోనా వైరస్‌ భారతావనిపై తన ఉక్కు పిడికిలిని క్రమంగా బిగిస్తోంది. దేశంలో తాజాగా 24 గంటల్లో రికార్డు స్థాయిలో ఏకంగా 6,767 మంది వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యారు. ఇప్పటివరకు ఒక్కరోజులో గరిష్ఠ పెరుగుదల ఇదే. గంటకు సగటున దాదాపు 282 కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఆరు వేలకుపైగా కేసులు నమోదు కావడం ఇది వరుసగా మూడో రోజు. ఈమేర‌కు కేంద్ర ఆరోగ్య శాఖ వివ‌రాలు వెల్ల‌డించింది.

దేశ‌వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,38,845
దేశంలో ప్ర‌స్తుతం యాక్టీవ్ కేసుల సంఖ్య 77,103
దేశవ్యాప్తంగా క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య మొత్తం 4,021
క‌రోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయిన‌వారు 57,721

వైరస్‌ దెబ్బకు తాజాగా 147 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 4,021కు పెరిగింది. ఇందులో 84 శాతం మరణాలు మహారాష్ట్ర, గుజరాత్‌, దిల్లీ, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌ల్లోనే సంభవించాయి. ఉత్తర్‌ ప్రదేశ్‌, బిహార్‌, కర్ణాటక, అసోం, ఉత్తరాఖండ్‌లు కొత్తగా కొవిడ్‌ హాట్‌స్పాట్‌లుగా మారాయి. జమ్మూ-కశ్మీర్‌, ఒడిశా, హరియాణా, కేరళ, ఝార్ఖండ్‌లలోనూ తాజాగా 24 గంటల్లో కేసులు ఎక్కువగానే నమోదయ్యాయి.