కరోనా లాక్డౌన్ నేపథ్యంలో డాక్టర్లు, వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సేవలు యావత్ ప్రపంచం కీర్తిస్తోంది. ప్రాణాలు సైతం లెక్కచేయకుండా ప్రజల కోసం వారు పడుతున్న శ్రమకు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇందులో పోలీసుల పాత్ర కూడా అత్యంత కీలకమైనది. రాత్రింబవళ్లు రోడ్లపై గస్తీ కాస్తు..వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు జనాలు బయటకు రాకుండా, ఎక్కడా గుంపులుగా చేరకుండా ఉండేందుకు వారు ఎంతగానో శ్రమిస్తున్నారు. అయితే, హైదరాబాద్లో మాత్రం ఓ ఇద్దర కానిస్టేబుళ్లు కక్కుర్తి చూపించారు. దీంతో వారిపై అధికారులు సస్సెన్ వేటు వేశారు. వివరాల్లోకి వెళితే..