కరోనా మహమ్మారి యావత్ దేశాన్ని ఒక్కసారిగా రెడ్ సిగ్నల్ వేసి ఆపేసింది. దీంతో దాదాపు గత 50 రోజులుగా ప్రజలు, వ్యవస్థలు అన్ని స్తంభించిపోయాయి. విస్తరిస్తున్న వైరస్ భూతాన్ని కట్టడి చేసేందుకు కేంద్రం లాక్డౌన్ ప్రకటించింది. ప్రజలు ఇళ్లనుంచి బయటకు రావొద్దని కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. అయితే, కేంద్రం ప్రకటించిన మూడో దశ లాక్డౌన్ మరో ఐదు రోజుల్లో ముగియనుంది. ఈ క్రమంలోనే కొన్ని ప్రాంతాల్లో సడలింపులు ఇస్తూ..కార్యకలాపాలు కొనసాగించేందుకు అనుమతిస్తున్నారు. ఇందులో భాగంగానే మే 11 నుంచి హైదరాబాద్ లో పలు ఐటీ కంపెనీలు తెరుచుకున్నాయి. ఇందుకు అనుగుణంగానే ఆర్టీసీ బస్సులు, ఎంఎంటీఎస్, క్యాబ్లు, ఆటోలు ప్రారంభిస్తే బాగుంటుందని అధికారులు భావిస్తున్నారు.