దేశ వ్యాప్తంగా నాలుగోసారి లాక్డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ 4.0లో మరికొన్నింటికి సడలింపులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. బట్టల షాపులతో పాటుగా.. ఎలక్ట్రానిక్ వస్తువులకు సంబంధించిన షాపులకు కూడా ఓపెన్ చేసుకునేందుకు అనుమతులనిచ్చింది. అయితే తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్.. కంటైన్మెంట్ జోన్లలో మినహా.. అన్ని చోట్ల అన్ని రకాల షాపులను తెరుచుకోవచ్చని ప్రకటించారు. అయితే లాక్డౌన్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని సూచించారు. ఈ క్రమంలో హైదరాబాద్లో కూడా దాదాపు రెండు నెలలుగా మూతపడ్డ షాపులన్ని తెరుచుకుంటున్నాయి. ఈ క్రమంలో జీహెచ్ఎంసీ కమిషనర్ పలు సూచనలు చేశారు.
పై నిబంధనలన్నీ.. ఈ నెల 31వ తేదీ వరకు జీహెచ్ఎంసీ కమిషనర్ స్పష్టం చేశారు.