శ‌ర‌ద్ ప‌వార్ ఇంట్లో కోవిడ్ క‌ల‌క‌లం

| Edited By:

Aug 17, 2020 | 2:52 PM

తాజాగా నేష‌న‌లిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శ‌ర‌ద్ ప‌వార్ ఇంట్లో కోవిడ్ మ‌హ‌మ్మారి క‌ల‌క‌లం సృష్టించింది. ఆయ‌న నివాసంలోని న‌లుగురికి క‌రోనా పాజిటివ్ నిర్థార‌ణ అయిన‌ట్లు మ‌హారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ తోపే వెల్ల‌డించారు. శ‌ర‌ద్ ప‌వార్‌కు మాత్రం కోవిడ్-19 నెగిటివ్..

శ‌ర‌ద్ ప‌వార్ ఇంట్లో కోవిడ్ క‌ల‌క‌లం
Follow us on

దేశ వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ తీవ్రంగా విజృంభిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఎన్ని ర‌కాలు జాగ్ర‌త్త చ‌ర్య‌లు చేప‌డుతున్నా ఈ వైర‌స్ ఏదో రూపంలో ఎటాక్ చేస్తూనే ఉంటుంది. ముఖ్యంగా రాజ‌కీయ నాయకులు, ప‌లువురు సెల‌బ్రిటీలను క‌రోనా వెంటాడుతూనే ఉంటోంది. ఇప్ప‌టికే ఎంతో మంది ఈ వైర‌స్ బారిన పడుతున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా నేష‌న‌లిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శ‌ర‌ద్ ప‌వార్ ఇంట్లో కోవిడ్ మ‌హ‌మ్మారి క‌ల‌క‌లం సృష్టించింది. ఆయ‌న నివాసంలోని న‌లుగురికి క‌రోనా పాజిటివ్ నిర్థార‌ణ అయిన‌ట్లు మ‌హారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ తోపే వెల్ల‌డించారు. శ‌ర‌ద్ ప‌వార్‌కు మాత్రం కోవిడ్-19 నెగిటివ్ వ‌చ్చింది. ఆయ‌న‌ ఇంట్లో ప‌ని చేసే వంట మ‌నిషి, ఇద్ద‌రు సెక్యూరిటీ సిబ్బందితో పాటు మ‌రొక‌రికి క‌రోనా పాజిటివ్ నిర్థార‌ణ అయింది. ఈ క్ర‌మంలో శ‌ర‌ద్ ప‌వార్ ముంబైలోని బ్రీచ్ క్యాండి ఆస్ప‌త్రిలో ఆదివారం ప‌రీక్ష‌లు చేయించుకోగా ఫ‌లితం నెగిటివ్ వ‌చ్చిన‌ట్లు మంత్రి తెలిపారు. ఇక ముందు జాగ్ర‌త్తా చ‌ర్య‌ల్లో భాగంగా, వైద్యుల సూచ‌న మేర‌కు కొద్ది రోజుల వ‌ర‌కు ప‌వార్ ప‌లు కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉండ‌నున్నారు.

Read More:

మ‌ళ్లీ పెరుగుతోన్న పెట్రోల్ ధ‌ర‌లు

బ్రేకింగ్ః ముంబైలోని క్రాఫోర్డ్ మార్కెట్లో భారీ అగ్నిప్రమాదం

ఏపీఎస్ఆర్టీసీ స‌రికొత్త సేవ‌లు.. బ‌స్సుల్లో వైఎస్సార్ జ‌న‌తా బ‌జార్లు

ఐదు రూపాయ‌ల డాక్ట‌ర్ మృతి.. సీఎం సంతాపం