ఏ దేశాలవారిని అనుమతించాలబ్బా ? ఈయూలో అయోమయం

| Edited By: Pardhasaradhi Peri

Jun 28, 2020 | 2:57 PM

కరోనా వైరస్ ప్రబలంగా ఉన్న నేపథ్యంలో.. ఏయే దేశాల నుంచి ప్రజలను జులై నుంచి తమ దేశాల్లోకి అనుమతించాలో తెలియక యూరపియన్ యూనియన్ కూటమి అయోమయంలో పడింది. దీనిపై నిర్ణయం తీసుకోవడానికి..

ఏ దేశాలవారిని అనుమతించాలబ్బా ? ఈయూలో అయోమయం
Follow us on

కరోనా వైరస్ ప్రబలంగా ఉన్న నేపథ్యంలో.. ఏయే దేశాల నుంచి ప్రజలను జులై నుంచి తమ దేశాల్లోకి అనుమతించాలో తెలియక యూరపియన్ యూనియన్ కూటమి అయోమయంలో పడింది. దీనిపై నిర్ణయం తీసుకోవడానికి మరికొంత సమయం అవసరమని ఈ కూటమిలోని కొన్ని సభ్యదేశాలు అభిప్రాయపడ్డాయి. అయితే ప్రస్తుతానికి 14 దేశాల జాబితాను ఈయూ దౌత్య ప్రతినిధులు అంగీకరించారు. అమెరికా, బ్రెజిల్, కెనడా, ఇండియా తప్ప మిగతా దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి. అల్జీరియా, ఆస్ట్రేలియా, జపాన్, మాంటినీగ్రో, మొరాకో, రువాండా, సెర్బియా, సౌత్ కొరియా వంటి దేశాలు వీటిలో ఉన్నాయి. చైనా నుంచి ప్రజలు ఎంటర్ కావచ్ఛునని, అయితే యూరపియన్లను కూడా ఆ దేశం అనుమతించాలని ఈయూ షరతు విధించింది. కరోనా వైరస్ వ్యాప్తి కొంతవరకు అదుపులోకి వఛ్చిన పక్షంలో మిగతా దేశాలను కూడా తమ సరిహద్దుల్లోకి అనుమతించాలని ఈ కూటమి అభిప్రాయపడుతోంది.