
కమ్యూనిటీ స్ప్రెడ్ 122 శాతం ఉందంటూ జరుగుతున్న ప్రచారాన్ని మంత్రి ఈటల రాజేందర్ ఖండించారు. తెలంగాణలో కరోనా కేసుల పేరుతో భోగస్ సర్వే జరుగుతుందని మంత్రి మండిపడ్డారు. హై రిస్క్ లో తెలంగాణ అంటూ India.in.pixels చేసిన సర్వే పూర్తిగా తప్పుడు వార్త అని అన్నారు. భారత్ లో అత్యధిక శాతం కమ్యూనిటి స్ప్రెడ్ కు ఛాన్స్ ఉందంటూ జరుగుతున్న ప్రచారాన్ని తప్పుపట్టారు. రాష్ట్రంలో కమ్యునిటీ స్ప్రెడ్ లేదని చెప్పిన ఐసిఎంఆర్ సర్వేను మంత్రి ఈటల గుర్తుచేశారు.