Delhi Corona Cases: దేశ రాజధానిలో కరోనా టెర్రర్.. ఫోర్త్ వేవ్ తప్పదా..? ప్రమాద సంకేతాలు

|

Apr 18, 2022 | 11:45 AM

ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతుండటం అధికార యంత్రాగాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. వారం రోజుల నుంచి పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతూ ఉన్నాయి.

Delhi Corona Cases: దేశ రాజధానిలో కరోనా టెర్రర్.. ఫోర్త్ వేవ్ తప్పదా..? ప్రమాద సంకేతాలు
Corona
Follow us on

Corona Fourth Wave: కరోనా ఫోర్త్‌వేవ్ టెన్షన్ పెడుతోంది. దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా ముప్పు ముంచుకొస్తోంది. ఢిల్లీ NCRపరిధిలో 15రోజుల్లోనే 500శాతం పెరిగిపోయింది వైరస్‌ వ్యాప్తి. ఆదివారం ఒక్కరోజే 517 కేసులు నమోదయ్యాయి. గత రోజు కంటే ఇది 12 శాతం ఎక్కువ. ఫిబ్రవరి 20తర్వాత ఇవే అత్యధిక కేసులు. కేసు పాజిటివిటీ రేటు సైతం 4.21కు పెరిగింది. ఢిల్లీలో కేసులు పెరిగిపోతుండటంతో కరోనా కట్టడికి ఇవాళ యాక్షన్‌ప్లాన్‌ రూపొందించనుంది ఢిల్లీ సర్కార్. ఢిల్లీ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీతో ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు సమావేశం అవ్వనున్నారు. భౌతిక దూరం, కరోనా ఆంక్షలపై ప్రధానంగా చర్చించనున్నారు. ఢిల్లీ పాఠశాలల్లోనూ  కరోనా కేసులు నమోదవుతూ ఉండటంతో.. అధికారులూ కట్టడి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చలు జరపనున్నారు. జలుబు(Cold), దగ్గు, జ్వరం(Fever) వంటి కరోనా లక్షణాలు ఉంటే స్కూల్‌కు రావొద్దని స్టూడెంట్స్‌కు సూచిస్తున్నారు. ఢిల్లీ మొత్తం కేసుల సంఖ్య 18 లక్షల 68 వేల 550కు చేరుకున్నాయి. ఢిల్లీ ఆసుపత్రుల్లో ప్రస్తుతం 9 వేల 662 బెడ్స్ కోవిడ్ రోగుల కోసం అందుబాటులో ఉన్నాయి. మరోవైపు 9 వేల 156 కోవిడ్19 ఆక్సిజన్ బెడ్స్, 2 వేల 174 ఐసీయూ బెడ్స్ ఉన్నాయి. ఇక 1246 వెంటిలేటర్ బెడ్స్ అందుబాటులో ఉన్నట్టు ఢిల్లీ ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

కేసులు పెరుగుతుండటంతో ఢిల్లీ, కోల్‌కతా విమానాలపై హాంకాంగ్‌ నిషేధం విధించింది. కరోనా కేసుల కారణంగా ఈ నెల 24వరకు రద్దు విమానాలను రద్దు చేసింది. హాంకాంగ్‌ వెళ్లే ప్రయాణికులకు కోవిడ్‌ టెస్ట్‌ తప్పనిసరిచేసింది. మరోవైపు చైనాలో కొవిడ్‌ పంజా విసురుతోంది. రోజురోజుకీ పెరిగిపోతున్నాయి కేసులు. కరోనా కట్టడికి షాంఘైలో లాక్‌డౌన్‌ విధిస్తున్నా వైరస్‌ విజృంభిస్తూనే ఉంది. షాంఘైలో లాక్‌డౌన్‌ తర్వాత కొవిడ్‌తో ఓ వ్యక్తి మృతి చెందడం కలకలం సృష్టిస్తోంది.

Also Read: Viral Photo: ఇతను కళ్లతో మాయ చేస్తాడు.. మాటలతో బూరెలు వండేస్తాడు… ఎవరో గుర్తించారా..?