నాగాలాండ్‌లో పెరిగిన కరోనా కేసులు.. రీజన్‌ ఇదే..

| Edited By:

May 30, 2020 | 7:24 PM

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే లక్షా డెబ్బై వేల మందికి పైగా కరోనా సోకింది. వీరిలో డెబ్బై వేల మంది కరోనా నుంచి కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇక మరో నాలుగు వేల తొమ్మిది వందల మంది మరణించారు. దేశంలో నమోదైన కేసుల్లో మహారాష్ట్రలో అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. ఆ తర్వాత గుజరాత్‌, ఢిల్లీ, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. అయితే ఇదిలా వుంటే.. […]

నాగాలాండ్‌లో పెరిగిన కరోనా కేసులు.. రీజన్‌ ఇదే..
Follow us on

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే లక్షా డెబ్బై వేల మందికి పైగా కరోనా సోకింది. వీరిలో డెబ్బై వేల మంది కరోనా నుంచి కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇక మరో నాలుగు వేల తొమ్మిది వందల మంది మరణించారు. దేశంలో నమోదైన కేసుల్లో మహారాష్ట్రలో అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. ఆ తర్వాత గుజరాత్‌, ఢిల్లీ, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. అయితే ఇదిలా వుంటే.. మొన్నటి వరకు అత్యల్పంగా నమోదైన రాష్ట్రాల్లో కూడా మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా.. నాగాలాండ్‌లో కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కట్టడిలో భాగంగా కఠిన చర్యలు చేపడుతున్న సంగతి తెలిసిందే. అయితే శనివారం సాయంత్రం నాటికి కొత్తగా 11 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 36కి చేరింది. ఈ విషయాన్ని నాగాలాండ్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. చెన్నై నుంచి వచ్చిన 11 మందికి కరోనా పరీక్షలు చేయగా.. వారందరికీ పాజిటివ్ వచ్చిందని.. వారిని ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నామని అధికారులు తెలిపారు.