కరోనా ఎఫెక్ట్.. దగ్గిందని.. రూ.26లక్షల విలువైన వాటిని పారేసిన సూపర్ మార్కెట్..

| Edited By:

Mar 27, 2020 | 8:02 PM

కరోనా.. ఇప్పుడు దీని పేరు వింటే చాలు.. ప్రపంచ దేశాలన్నీ వణికిపోతున్నాయి. ఎక్కడ ఎవరు దగ్గినా.. తుమ్మినా అంతే.. వారిని వింతగా చూస్తూ దూరం వెళ్లిపోతున్నారు. చైనాలో పుట్టిన ఈ వైరస్.. ఇప్పుడు అగ్ర రాజ్యం అమెరికాను కూడా వణికిస్తోంది. ఎంతలా వణికిస్తోందంటే.. అక్కడ ఓ యువతి సూపర్ మార్కెట్‌ వెళ్లి దగ్గడంతో.. కరోనా అని బయపడి.. అందులో ఉన్న రూ.26లక్షల ఆహార పదార్ధాలన్నింటిని బయటపడేశారు. అంటే అర్థం చేసుకోవచ్చు. అక్కడి పరిస్థితి ఎలా ఉందో. తాజాగా […]

కరోనా ఎఫెక్ట్.. దగ్గిందని.. రూ.26లక్షల విలువైన వాటిని పారేసిన సూపర్ మార్కెట్..
Follow us on

కరోనా.. ఇప్పుడు దీని పేరు వింటే చాలు.. ప్రపంచ దేశాలన్నీ వణికిపోతున్నాయి. ఎక్కడ ఎవరు దగ్గినా.. తుమ్మినా అంతే.. వారిని వింతగా చూస్తూ దూరం వెళ్లిపోతున్నారు. చైనాలో పుట్టిన ఈ వైరస్.. ఇప్పుడు అగ్ర రాజ్యం అమెరికాను కూడా వణికిస్తోంది. ఎంతలా వణికిస్తోందంటే.. అక్కడ ఓ యువతి సూపర్ మార్కెట్‌ వెళ్లి దగ్గడంతో.. కరోనా అని బయపడి.. అందులో ఉన్న రూ.26లక్షల ఆహార పదార్ధాలన్నింటిని బయటపడేశారు. అంటే అర్థం చేసుకోవచ్చు. అక్కడి పరిస్థితి ఎలా ఉందో. తాజాగా పెన్సిల్వేనియాలో జరిగిన ఘటన చూస్తే షాక్ తినాల్సిందే.
స్థానికంగా ఉన్న ఓ సూపర్ మార్కెట్‌కు షాపింగ్ కోసం ఓ యువతి వచ్చింది. అయితే కావాలని అక్కడి సదరు యువతి అహారపదార్ధాలపై దగ్గింది. అది గమనించిన స్టోర్ సిబ్బంది వెంటనే ఆమెను అందులో నుంచి బయటకు పంపేశారు.

అనంతరం ఆ స్టోర్‌లో యువతి ఎక్కడెక్కడ తిరిగిందో.. గమనించి.. ఆ ప్రాంతాన్నంతా శానిటైజేషన్‌తో శుభ్రంచేశారు. విషయం తెలుసుకున్న స్టోర్ యజమాని.. అందులో ఉన్న ఆహార పదార్ధాలన్నింటిని పారేశారట. అయితే ఆ దగ్గిన యువతిని పట్టుకున్న అధికారులు.. ఆమెకు కరోనా పరీక్షలు చేయించడానికి తీసుకెళ్లారు.